భారత్లో రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవే..!
దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోన తీవ్రత అదుపులోనే ఉందని.. ఈ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించింది.
మరోసారి స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోన తీవ్రత అదుపులోనే ఉందని.. ఈ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించింది. కొవిడ్ టీకాలపై ఇప్పటికీ ప్రజల్లో సందేహాలున్నాయని..సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించింది.
‘దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలకు వ్యాక్సిన్లపై ఇంకా సందేహాలున్నాయి. కానీ, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అత్యంత సురక్షితమైనవి, పూర్తి సమర్థవంతమైనవి. వాట్సాప్తో పాటు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న అలాంటి అసత్య వార్తలను నమ్మవద్దు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టంచేశారు. దిల్లీలోని ఓ ఆసుపత్రిలో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ దంపతులు కొవిడ్ రెండో డోసు తీసుకున్నారు. ఈ సందర్భంలో తొలి డోసు తీసుకున్న అనంతరం తమకు ఎటువంటి ఇబ్బందులు కలుగలేదని పేర్కొన్నారు.
టీకా తీసుకున్నాక పాజిటివ్ వస్తే..?
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్ వస్తున్నట్లు అరుదైన కేసులను గుర్తించాం. ఇలా పాజిటివ్ వచ్చినప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా వారిలో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు తక్కువ. ఆసుపత్రిలో చేరేంత తీవ్రత నుంచి బయటపడడంలో వ్యాక్సిన్ దోహదపడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్ తీవ్రత అదుపులోనే ఉందన్న ఆయన, కొవిడ్ నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.
ప్రయోగాల్లో ఏడు వ్యాక్సిన్లు..
ప్రస్తుతం దేశంలో ఏడు కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. వాటిలో కొన్ని తుదిదశకు చేరుకోగా మరో 20కిపైగా వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ దశలో ఉన్నాయని తెలిపారు. ఇక ఇప్పటికే ప్రయోగాలు పూర్తి చేసుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్కు మరికొన్ని రోజుల్లోనే అనుమతి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 6కోట్ల 11లక్షల కొవిడ్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో 5కోట్ల 22లక్షల మంది తొలిడోసు తీసుకోగా, వీరిలో 89లక్షల మందికి రెండు డోసులను అందించారు. అత్యధికంగా మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో 50లక్షల చొప్పున కొవిడ్ డోసుల పంపిణీ పూర్తయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!