Harassment: మహిళా కోచ్ లైంగిక ఆరోపణలు.. హరియాణా మంత్రిపై కేసు..!
హరియాణా క్రీడల మంత్రి సందీప్ సింగ్ (Sandeep Singh) పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ (Woman Coach) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో మంత్రి బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు సందీప్ సింగ్ ప్రకటించారు.
దిల్లీ: హరియాణా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ (Sandeep Singh)పై లైంగిక ఆరోపణల కేసు నమోదయ్యింది. తనను లైంగిక వేధించాడని (Sexual Harassment) జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ (Woman Coach) ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు క్రీడల మంత్రిపై లైంగిక వేధింపుల (Sexual Harassment) కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా తన పదవీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు మంత్రి సందీప్ సింగ్ (Sandeep Singh) ప్రకటించారు. తన ఇమేజ్ను చెడగొట్టేందుకే కొందరు చేస్తోన్న ప్రయత్నమన్న ఆయన.. వీటిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే మంత్రిత్వ శాఖ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు.
తనకు అనుకూలంగా వ్యవహరిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తానంటూ క్రీడల మంత్రి లైంగిక వేధింపులకు గురి చేశారని హరియాణాకు చెందిన జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఆరోపణలు చేశారు. తనను సంతోషంగా ఉంచితే కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తానని అన్నారని.. అందుకు లొంగకపోవడం వల్ల తనని వేరే చోటుకి బదిలీ చేశారని అన్నారు. దీనిపై డీజీపీ, సీఎం, రాష్ట్ర హోంమంత్రి శాఖ కార్యాలయాలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఇటీవల మీడియా ముందు మహిళా అథ్లెట్ కోచ్ వాపోయారు. ఇలా మంత్రి సందీప్ సింగ్ చాలా మంది క్రీడాకారిణులను లైంగికంగా వేధించారని.. మంత్రికి భయపడి వారెవరూ బయటికి చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే మంత్రి బాధ్యతల నుంచి సందీప్ సింగ్ వైదొలిగిటనట్లు తెలుస్తోంది.
కురుక్షేత్రలోని పెహోవా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సందీప్ సింగ్ కూడా హాకీ క్రీడాకారుడే. జాతీయ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించారు. 2018లో సూర్మా పేరుతో ఆయనపై బయోపిక్ కూడా వచ్చింది. అందులో పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ సందీప్ పాత్రను పోషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్