మరో 14 జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత  

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్న వేళ హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  17 జిల్లాల్లో జనవరి 30 వరకు.....

Published : 29 Jan 2021 21:15 IST

హరియాణా ప్రభుత్వం నిర్ణయం

చండీగఢ్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్న వేళ హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  17 జిల్లాల్లో జనవరి 30 వరకు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే పాల్వాల్‌, సోనిపట్‌, ఝజ్జర్‌లలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసిన మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం.. తాజాగా మరో 14 జిల్లాల్లో ఇదే తరహా చర్యలు చేపట్టింది. మూడు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనలకు మద్దతుగా ఘాజీపూర్‌, టిక్రీ, సింఘూ సరిహద్దుల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా దుష్ప్రచారం, పుకార్లను కట్టడి చేసేందుకే  ఈ చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ అరోరా తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని