Hathras: హాథ్రస్ సామూహిక హత్యాచారం కేసు.. ఒకరిని దోషిగా తేల్చిన కోర్టు
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘హాథ్రస్ హత్యాచారం కేసు’లో ప్రధాన నిందితుడు సందీప్ను ఇక్కడి ఎస్సీ/ఎస్టీ కోర్టు దోషిగా తేల్చింది. మరో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. 2020 సెప్టెంబరులో 19 ఏళ్ల ఓ ఎస్సీ యువతిపై నిందితులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు రాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలొదిలిన విషయం తెలిసిందే.
లఖ్నవూ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh) హాథ్రస్ సామూహిక అత్యాచారం, హత్య కేసు(Hathras Case)లో ప్రధాన నిందితుడిని ఇక్కడి ఎస్సీ/ఎస్టీ కోర్టు గురువారం దోషిగా తేల్చింది. మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, నేరస్థుడికి శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. 2020 సెప్టెంబరు 14న నలుగురు నిందితులు 19 ఏళ్ల ఎస్సీ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆమె దిల్లీ(Delhi)లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది.
కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి, అర్ధరాత్రి ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం, ఈ కేసులో పోలీసుల వ్యవహారశైలి అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ పరిణామాలు అప్పట్లో దేశమంతటినీ కుదిపేశాయి. దీంతో దిగొచ్చిన ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం.. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దాదాపు రెండు నెలల పాటు దర్యాప్తు చేపట్టి.. సందీప్, రవి, లవ్కుశ్, రాములపై సామూహిక అత్యాచారం, హత్య అభియోగాలు మోపింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. ప్రధాన నిందితుడు సందీప్ను దోషిగా తేల్చింది. మరో ముగ్గురు.. రవి, లవ్కుశ్, రాములను నిర్దోషులుగా ప్రకటిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!