Corona: పిల్లల్లో మళ్లీ కొవిడ్ కలకలం.. వైద్యరంగ నిపుణులేమంటున్నారంటే?
దేశంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక దిల్లీ, నోయిడా వంటి పలు నగరాల్లో పిల్లల్లో మరోసారి కరోనా కేసులు వెలుగుచూస్తున్న వేళ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.......
దిల్లీ: దేశంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక ఇటీవలి కాలంలో దిల్లీ, నోయిడా వంటి పలు నగరాల్లోని పిల్లల్లో మరోసారి కొవిడ్ కేసులు రావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యలో పలువురు వైద్యరంగ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. పిల్లల్లో కరోనా వస్తున్నప్పటికీ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయనీ.. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అర్హులైన పిల్లలంతా తక్షణమే వ్యాక్సిన్ వేయించుకోవాలంటున్నారు. మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడకం, తరచూ చేతుల్ని శుభ్రపరచుకోవడం వంటి కొవిడ్ మార్గదర్శకాల్ని పిల్లలు, ఉపాధ్యాయులు స్థిరంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
భయపడాల్సిన అవసరంలేదు.. రణ్దీప్ గులేరియా
పిల్లల్లో కరోనా వచ్చినా ఆ ప్రభావం స్వల్పంగానే ఉంటోందనీ.. లక్షణాలకు తగిన చికిత్సతోనే కోలుకొంటున్నట్టు గతంలో వచ్చిన కొవిడ్ దశల డేటాయే స్పష్టంగా చెబుతోందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సినేషన్కు అర్హులైన పిల్లలు టీకాలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఇప్పటికీ ఇంకా టీకాలు వేయించుకోని వారు కూడా భయపడాల్సిన అవసరంలేదనీ.. వారికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు.
పిల్లల్లో లక్షణాలు స్వల్పమే: చంద్రకాంత్ లహరియా
పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక పిల్లలు కరోనా బారినపడుతున్న వార్తల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఫిజీషియన్ ఎపిడిమియోలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా అన్నారు. పాఠశాలలు మూసివేసిన సమయంలో దాదాపు 70 నుంచి 90శాతం మంది పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడినట్టు వేర్వేరు సీరోప్రెవెలెన్స్ సర్వేల ద్వారా తెలుస్తోందని చెప్పారు. పెద్దల్లో లాగే చిన్నారుల్లోనూ కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు స్వల్పమేనన్నారు. కొత్త వేరియంట్లు వచ్చినా పిల్లలపై చూపించిన ప్రభావం స్వల్పంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని పాఠశాలల్లోని కొందరు చిన్నారులకు పాజిటివ్ వస్తోందన్న వార్తలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి: సమీరన్ పాండే
కొవిడ్ వ్యాప్తికి పాఠశాలలు వాహకాలుగా లేనట్టు అంతర్జాతీయంగా వస్తున్న ఆధారాలు సూచిస్తున్నాయని ఐసీఎంఆర్ అదనపు డీజీ సమీరన్ పాండా అన్నారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడకం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి ప్రామాణికమైన ప్రొటోకాల్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాటించాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్లు సిఫారసు చేయనప్పటికీ, ఆరు నుంచి 11 ఏళ్ల వయసు వారు మాత్రం తమ వినియోగ సామర్థ్యాన్ని బట్టి మాస్క్ ధరించవచ్చని తెలిపారు. 12ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన వారు మాత్రం పెద్దల మాదిరిగానే మాస్క్లు వినియోగించుకోవాలని పాండా సూచించారు. పాఠశాలల్లో తగిన వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఎయిర్ కండిషన్ వాడకానికి దూరంగా ఉండాలన్నారు. కరోనా సోకే ప్రమాదం లేకుండా తరగతి గదుల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లను అమర్చాలని సూచించారు. పిల్లలంతా కలిసి ఒకేచోట కలిసి భోజనం చేయకుండా చూడటంతో పాటు క్యాంటీన్లు/డైనింగ్ హాళ్లలో ఎక్కువసేపు సేపు గడపకూడదని సూచించాలన్నారు.
పిల్లలకు టీకాలు వేయించండి: నమీత్ జెరాత్
అర్హులైన చిన్నారులంతా తక్షణమే టీకాలు వేయించుకొనేలా తల్లిదండ్రులు చూడాలని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రుల సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నమీత్ జెరాత్ సూచించారు. కొవిడ్కు వ్యతిరేకంగా రోగ నిరోధకతను పెంచుకోవడంలో టీకాలే ఎంతో కీలకమన్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలు టీకా వేయించుకొనేందుకు కనీసం మూడు నెలల కాలం పాటు వేచి ఉండాలన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. పిల్లలకు ఏవైనా ఎలర్జిటిక్ సంబంధించి చికిత్స తీసుకుంటుంటే మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలన్నారు. వ్యాక్సినేషన్ అనంతరం పిల్లలకు స్వల్ప జ్వరం, చేతినొప్పి వంటివి రావొచ్చనీ.. ఆ సమయంలో కేవలం అవసరమైతేనే పారాసిటమాల్ వాడాలన్నారు. వ్యాక్సినేషన్కు ముందు పిల్లలకు పారాసిటమాల్ ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వొద్దని డాక్టర్ జెరాత్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్