వ్యాక్సిన్ మొదటి డోసు: పాజిటివ్ సూచనలు

ఆక్స్‌ఫర్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ భారత్‌లో రెండో దశ ప్రయోగ స్థాయిలో ఉంది. 

Updated : 27 Aug 2020 16:43 IST

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ భారత్‌లో రెండో దశ ప్రయోగ స్థాయిలో ఉంది. ఈ క్రమంలో పుణెకు చెందిన భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆసుప్రతిలో ఇద్దరు వాలంటీర్లకు బుధవారం ఈ వ్యాక్సిన్‌ ఇవ్వగా.. వారి ఆరోగ్యం, శరీర పనితీరు చక్కగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన ఈ ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను 32, 48 సంవత్సరాల వయసున్న ఇద్దరు వ్యక్తులకు మొదటి డోసు వేశారు. ‘బుధవారం వ్యాక్సిన్‌ ఇచ్చిన దగ్గరి నుంచి మా వైద్య సిబ్బంది వారిని పరిశీలనలో ఉంచారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. నొప్పి, జ్వరం, సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఇతర అనారోగ్య సూచనలేమీ కనిపించలేదు. వారిని 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచి, అనంతరం ఇంటికి పంపివేశాం. వారిని ఎప్పటికప్పుడు మా సిబ్బంది సంప్రదిస్తూనే ఉన్నారు’ అని భారతి విద్యాపీఠ్ డిప్యూటీ మెడికల్ డైరెక్టర్‌ జితేంద్ర ఓస్వాల్ వెల్లడించారు. నెలరోజుల తరవాత వారికి మరో డోసు ఇస్తామని తెలిపారు. మరికొంతమందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు  చెప్పారు. 
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారైన సీరమ్ సంస్థ..ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థ భారత్‌తో దాని భద్రతను పరిశీలిస్తోంది.  

ఇవీ చదవండి: 

కరోనా టెస్టుపై అమెరికా తాజా నిర్ణయం..!
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని