Talibans: అఫ్గానిస్థాన్లో తాలిబన్లు ఎలా గెలిచారు?
అనుకున్నదంతా జరిగింది.. అయితే ఊహించినదానికన్నా వేగంగా తాలిబన్లు అఫ్గాన్లో అధికారాన్ని అందుకోవడం గమనార్హం. అఫ్గాన్ ప్రభుత్వం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: అనుకున్నదంతా అయ్యింది.. అయితే ఊహించినదానికన్నా వేగంగా తాలిబన్లు అఫ్గాన్లో అధికారాన్ని అందుకోవడం గమనార్హం. అఫ్గాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు ప్రభుత్వ పగ్గాలను అప్పగించింది. యావత్ ప్రపంచం తమకు అండగా ఉంటుందని ఆశించిన అఫ్గాన్ సామాన్యులకు నిరాశే మిగిలింది. మళ్లీ తాలిబన్ల రాక్షస పాలనలోకి వెళ్లనున్నామనే ఆందోళన నెలకొంది. ప్రపంచంలోనే అత్యాధునిక ఆధునిక సామగ్రిని అమెరికా అఫ్గాన్ దళాలకు అప్పగించింది. శిక్షణ ఇచ్చింది. అయినా తాలిబన్లతో ఎలాంటి పోరాటం లేకుండా లొంగిపోవడం ఆశ్చర్యమే.
ఏం జరిగింది..
2001 సెప్టెంబరు ఉగ్రవాద దాడుల అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ జూనియర్ సారథ్యంలో అఫ్గానిస్థాన్పై దాడులు జరిగాయి. ఆ దేశ దక్షిణ భాగంలో ఫస్తూన్లు ఎక్కువ. అయితే ఉత్తర భాగంలో తజక్లు, ఉజ్బెక్లు, హజిరాలు ఉంటారు. వీరి సారథ్యంలో ఉత్తరకూటమి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. గగనమార్గాన నాటో దళాలు దాడులు జరుపుతుంటే భూమార్గంలో ఉత్తరకూటమి తాలిబన్లపై విరుచుకుపడింది. అనంతరం తాలిబన్లు పారిపోవడం, అమెరికా అండతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రజాస్వామ్య పవనాలను ఆస్వాదించిన అఫ్గాన్ ప్రజలకు తాజాగా మళ్లీ తాలిబన్ల పాలన రావడం అంతులేని విషాదాన్ని కలిగించింది.
బైడెన్ నిర్ణయమే మార్చింది..
అఫ్గాన్ నుంచి తమ దళాలను సెప్టెంబరు 11 కల్లా ఉపసంహరిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడంతో తాలిబన్లలో ఉత్సాహం ప్రారంభమైంది. అఫ్గాన్ సైనిక బలగాల సంఖ్య దాదాపు మూడు లక్షల వరకు ఉంటుందని అంచనా. అదే తాలిబన్ల సంఖ్య 75 వేలకు కూడా మించదు. కానీ అఫ్గాన్ సైన్యం మానసికస్థైర్యం దెబ్బతినేలా అమెరికా సేనలు త్వరితగతిన వెనక్కి వెళ్లడం ప్రారంభించాయి. దీంతో అఫ్గాన్ సేనల బలం లక్షల్లో ఉండటంతో పాటు తాము ఇచ్చిన శిక్షణ, ఆధునిక ఆయుధాలు తాలిబన్లను నిలువరిస్తాయని బైడెన్ వేసిన అంచనా తారుమారైంది. అనేక ప్రాంతాల్లో అఫ్గాన్ సేనలు కనీసం ఒక్క తూటా కూడా కాల్చకుండా నేరుగా తాలిబన్ల ముందు సాగిలపడ్డాయి.
ఒక జిల్లా తర్వాత ఒక జిల్లా..
ఉత్తర్ కుందుజ్నే తీసుకుంటే దాదాపు రెండు నెలలపాటు తాలిబన్లు దిగ్బంధించారు. అఫ్గాన్ సేనలకు వచ్చే ఆహార, మందుగుండు సామగ్రి సరఫరాలను అడ్డుకున్నారు. దీంతో అఫ్గాన్ సేనలు తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోయాయి. మరి కొందరు ఆయుధాలను పారవేసి పారిపోయారు. గేటులోకి తాలిబన్లు వచ్చినా ఎలాంటి ప్రతిఘటన లేకుండా సైన్యం తిరుగుముఖం పట్టింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని అఫ్గాన్ సైనికాధికారి పేర్కొనడం గమనార్హం.
ఏరీ.. ఆనాటి యోధులు..
అప్పట్లో తాలిబన్లను ఓడించిన వారిలో ఉత్తరకూటమి కీలకపాత్ర పోషించింది. అయితే అప్పటి యోధులు వయసు మీద పడటంతో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు. యువత ఏనాడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఆలోచించలేదు. దేశంలో సాధారణ పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని విశ్వసించారు. దేశంలో ఎక్కువమంది యువత. 2001 తరువాత జన్మించిన వారే. వారికి తాలిబన్ల పాలన గురించి తెలియదు. సాధారణ పరిస్థితులు ఉండటంతో యువత ఏనాడూ ఆయుధ శిక్షణ గురించి ఆలోచించలేదు. ప్రభుత్వమూ ఇలాంటి పరిస్థితి ఊహించలేదు.
‘పాపి’స్థాన్తోనే తాలిబన్ల స్వైరవిహారం
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు గతంలో ఓడిపోయినా ఆ సంస్థను చురుకుగా ఉంచడంలో పాకిస్థాన్దే కీలక భూమిక. పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో వీరికి ఆయుధాలతో పాటు శిక్షణ 2001 నుంచి ఇప్పటివరకూ కొనసాగింది. పాక్కు చెందిన వేలాది ఉగ్రవాదులు అఫ్గాన్ పౌరప్రభుత్వంపై జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. దీంతో వారికి ఎదురులేకుండాపోయింది.
తన నిర్ణయం సరైనదేనన్న బైడెన్
బుష్ హయాములో అఫ్గాన్పై సైనికదాడులు చేపట్టినప్పుడు కేవలం తాలిబన్లను అధికారం నుంచి దించివేయడంపైనే అమెరికా దృష్టిపెట్టింది. అనంతరం విధానాన్ని మార్చుకొని ఆ దేశ పునర్ నిర్మాణం చేపట్టింది. లక్షల కోట్ల డాలర్లను ఆ దేశంలో ఖర్చుపెట్టింది. ఇది ఆర్థికంగా అమెరికాకు నష్టమే. అఫ్గాన్లో ఎలాంటి సహజవనరులు లేవు. వీటి ద్వారా అమెరికాకు ఎలాంటి ఆదాయమూ లేదు. అఫ్గాన్ నుంచి అమెరికా వెనక్కు మళ్లాలని పలువురు డిమాండ్ చేశారు. బుష్ జూనియర్, ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్లు అఫ్గాన్ వ్యవహారాలను పర్యవేక్షించారు. తాలిబన్లకు పాక్తో పాటు చైనా , రష్యాలు ఆయుధాలను సరఫరా చేశాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఆర్థికంగా ఎలాంటి లాభదాయకం లేకపోవడంతో అమెరికా చివరకు తప్పుకుంది. ఫలితంగా తాలిబన్లు అవలీలగా దేశాన్ని తిరిగి తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.