అమెరికాలోనే కొవిడ్ మరణాలు ఎక్కువ..ఎందుకంటే!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాలో భారీ స్థాయిలో కరోనా మరణాలు చోటుచేసుకోవడం కలవరపెట్టే విషయమే.
న్యూయార్క్: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 5లక్షల మంది కరోనా వైరస్కు బలయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం, కొరియా, వియత్నాం యుద్ధాల్లో మొత్తం ఎంత మంది మరణించారో.. కొవిడ్ కారణంగా ఒక్క ఏడాదిలోనే అక్కడ అంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాలో ఈ స్థాయిలో కరోనా మరణాలు చోటుచేసుకోవడం కలవరపెట్టే విషయమే. ఈ నేపథ్యంలో న్యూయార్క్లోని ఎల్మ్హర్ట్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణలు డాక్టర్ మస్సీ, మాంటెఫియోర్ గ్రూపునకు చెందిన నిపుణురాలు హాల్పెర్న్ అమెరికాలో అత్యధిక మరణాలు సంభవించడానికి గల కారణాలను విశ్లేషించారు.
దేశంలో కొవిడ్ ప్రవేశించకముందు ఇలాంటి మహమ్మారిలను నేరుగా ఎదుర్కొన్న అనుభవం అమెరికాకు లేదు. ముఖ్యంగా, కెనడాలో సార్స్ విజృంభించినప్పటికీ అమెరికాలో లేదు. మరో ప్రమాదకరమైన మెర్స్ కూడా అమెరికాలో వెలుగుచూడలేదు. ఇక ఎబోలా వంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారీ ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నప్పటికీ, అమెరికాలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. కరోనా వైరస్ తీవ్రతను అంచనా వేయడంలో ఇవి కొంతవరకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. వీటితో పాటు అమెరికాలో అత్యధిక స్థాయిలో ఉండే ప్రైవేటు ఆరోగ్య వ్యవస్థ, మాస్కులపై రాజకీయం వంటి అంశాలు వైరస్ వ్యాప్తి పెరుగుదలకు కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.
భారీ ప్రైవేటు ఆసుపత్రుల వ్యవస్థ..
‘తక్కువ జనాభా కలిగిన దేశాలు పటిష్ట ఆరోగ్య వ్యవస్థలతో తొందరగా ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొనే అవకాశం ఏర్పడింది. 50 స్వతంత్ర రాష్ట్రాలు కలిగిన అమెరికాలో ఎక్కువ జనాభా ఉండడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల వ్యవస్థ భారీస్థాయిలో ఉంది. దీంతో ఒకేవిధమైన వ్యూహంతో ప్రతి ఒక్కరికీ సేవలందించడం కష్టమయ్యింది. వీటికి తోడు డొనాల్డ్ ట్రంప్ పాలనా విభావం కరోనా వైరస్ను ఎదుర్కొన్న విధానం సరిగా ఉపయోగపడలేదు’ అని న్యూయార్క్లోని ఎల్మ్హర్ట్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణలు డాక్టర్ మస్సీ వెల్లడించారు. పీపీఈ కిట్లకోసం ప్రైవేటు ఆసుపత్రుల మధ్యే పోటీపడిన విధానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని, ఇలాంటి విషయాల్లో కలసికట్టుగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులు సమన్వయంగా వ్యవహరించ లేకపోయయని అభిప్రాయపడ్డారు.
మాస్క్కు రాజకీయ రంగు
వైరస్ మహమ్మారి వణికిస్తోన్న వేళ.. మాస్క్ ధరించడం కూడా రాజకీయ అంశంగా మారడం పెద్ద సమస్య అని అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. ఇది పూర్తిగా ఆరోగ్యసంరక్షణ సమస్య అయినప్పటకీ ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఫెడరల్ ప్రభుత్వం ఇబ్బంది పడినట్లు న్యూయార్క్లోని మరో అంటువ్యాధుల నిపుణురాలు హాల్పెర్న్ పేర్కొన్నారు. ఇక అక్కడి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ మాస్కు కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీనితో పాటు కరోనా వైరస్పై అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరును నిపుణులు గుర్తుచేస్తున్నారు.
అమెరికా నేర్చుకోవాల్సిందేమిటీ..?
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రులకు రోగుల తాకిడి ఎక్కువైతే ఏవిధంగా సమన్వయంతో ముందుకెళ్లాలనే విషయం ప్రైవేటు ఆసుపత్రులు నేర్చుకోవాల్సి ఉందని డాక్టర్ మస్సీ పేర్కొన్నారు. వీటితో పాటు అత్యవసర చికిత్స విభాగాలు(ఐసీయూ), వైద్య సిబ్బందిని నియమించుకోవడం వంటి విషయాల్లోనూ ముందుజాగ్రత్తగా ఉండటం కీలకమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటికి తగిన ఏర్పాట్లు చేయగలిగినట్లు నిపుణులు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలనే విషయాన్ని కరోనా మహమ్మారి తెలియజేసిందని హాల్పెర్న్ నొక్కిచెప్పారు. నల్లజాతీయులు, లాటిన్కు చెందిన వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు వస్తోన్ నివేదికలు వివిధ వర్గాలపై అసమానతలను తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాదాపు 70నుంచి 80శాతం మందికి ఇది అందినప్పుడే మాస్కు లేకుండా స్వేచ్ఛగా ఉండే వాతావరణం ఏర్పడుతుందని నిపుణుల అభిప్రాయం. అయితే, వ్యాక్సిన్లు ఎంతకాలం పాటు రక్షణ ఇస్తాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో రాబోయే రోజుల్లో సంభవించే మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!