PM Modi: ఆ మూడింటికీ కత్తెర వేయడమే నా ‘సర్జరీ’ స్టైల్: మోదీ
కరోనా సమయంలో కొన్ని దేశాల్లో ఒక్క వ్యాక్సిన్ డోసు కూడా దొరక్క జనం అల్లాడిపోగా.. మరికొన్ని దేశాల్లో ప్రజలకు నాలుగైదు డోసులు లభ్యం కావడం తనను బాధించిందన్నారు. అందువల్లే జీ20 సదస్సులో వన్ ఎర్త్- వన్ హెల్త్ అని పిలుపునిచ్చిన సందర్భాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు.
అహ్మదాబాద్: రెండు దశాబ్దాల క్రితం గుజరాత్ అనేక వ్యాధుల బారిన పడిందని.. ఆ సమయంలో తమ ప్రభుత్వం పాత వ్యవస్థలను మార్చేందుకు ‘సర్జరీ’ చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. గుజరాత్లో పర్యటనలో ఉన్న ప్రధాని.. అహ్మదాబాద్లో రూ.1,275 కోట్లతో నిర్మించిన సివిల్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో కొన్ని దేశాల్లో ఒక్క వ్యాక్సిన్ డోసు కూడా దొరక్క జనం అల్లాడిపోగా.. మరికొన్ని దేశాల్లో ప్రజలకు నాలుగైదు డోసులు లభ్యం కావడం తనను బాధించిందన్నారు. అందువల్లే జీ20 సదస్సులో తాను వన్ ఎర్త్- వన్ హెల్త్ అని పిలుపునిచ్చిన సందర్భాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో వైద్య వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు వైద్యులు అప్పట్లో తమకు సూచించిన మెడిసిన్, సర్జరీ, సంరక్షణ (కేర్) అనే మూడు అంశాలపై గట్టిగా కృషిచేశామన్నారు.
‘‘20-25 ఏళ్ల క్రితం గుజరాత్ను అనేక వ్యాధులు బాధించాయి. ఆరోగ్య సంరక్షణలో వెనుకబాటు, విద్యుత్ కొరత, నీటి కొరత, పరిపాలనా లోపం, శాంతిభద్రతల సమస్య ఉండేవి. ఆ వ్యాధులన్నింటికీ మూలకారణం ఓటు బ్యాంకు రాజకీయం అనే అతిపెద్ద మహమ్మారి. సర్జరీ అంటే అర్థం పాత వ్యవస్థను మార్చడమే. నేను చేసే సర్జరీ ప్రభుత్వంలో నిష్క్రియ, అలసత్వం, అవినీతికి కత్తెర వేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఔషధాలు (మెడిసిన్). కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేయడం, మానవ వనరులు, మౌలికసదుపాయాలు, ఆవిష్కరణలు, కొత్త ఆస్పత్రుల నిర్మాణం చేపట్టడం. మూడోది సంరక్షణ (కేరింగ్).. గుజరాత్ ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడంలో ఇదే అత్యంత ముఖ్యమైన అంశం. ఇందుకోసం మా ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో పనిచేసింది. ప్రజల్లోకి వెళ్లాం.. వారి సమస్యల్ని తెలుసుకున్నాం. అంతేకాదు.. కేవలం మనుషులకు మాత్రమే కాకుండా జంతువులకు కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించిన తొలి రాష్ట్రం గుజరాతేనని వినమ్రంగా చెప్పగలను’’ అని మోదీ అన్నారు. గుజరాత్కు నరేంద్ర మోదీ నాలుగు పర్యాయాలు సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!