Babasaheb Purandare: ప్రముఖ రచయిత బాబాసాహెబ్ పురందరే కన్నుమూత
దిల్లీ: భారతీయ ప్రముఖ రచయిత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బాబాసాహేబ్ పురందరే సోమవారం ఉదయం 5గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
దిల్లీ: భారతీయ ప్రముఖ రచయిత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బాబాసాహెబ్ పురందరే సోమవారం ఉదయం 5గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా రెండురోజుల క్రితం పుణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన... వెంటిలేటర్ సాయంతో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. దేశప్రధాని మోదీతో సహా ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా పురందరేతో ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా గుర్తుచేసుకున్నారు.
‘‘మాటల్లో వ్యక్తపరచలేనంత బాధ కలిగింది. శివషాహీర్ బాబాసాహెబ్ పురందరే మరణం చరిత్ర, సాంస్కృతిక ప్రపంచంలో ఒక పెద్ద శూన్యతను మిగిల్చింది. రాబోయే తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్తో మరింత దగ్గరయ్యేలా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఆయన రచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. బాబాసాహెబ్ పురందరే చమత్కారుడు, తెలివైనవాడు, భారతీయ చరిత్ర గురించి గొప్ప జ్ఞానం కలిగిన వేత్త. కొన్నేళ్లుగా ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన ఘనత నాకు దక్కింది. కొన్ని నెలల క్రితం, తన శతాబ్ది సంవత్సర కార్యక్రమంలో ప్రసంగించారు’’ అంటూ ట్వీట్ చేశారు. బాబాసాహెబ్కు ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
ఛత్రపతి శివాజీ గురించి ఎన్నో రచనలు
మహారాష్ట్రలోని బల్వంత్ మోరేశ్వర్ పురందరే.. బాబాసాహెబ్ పురందరేగా ప్రసిద్ధి. ఛత్రపతి శివాజీపై అనేక పుస్తకాలను రచించారు. ఆయన జీవితం మొత్తం చరిత్ర పరిశోధనలకే అంకితం చేశారు. 2019 జనవరి25న భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్, 2015లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు అందుకున్నారు. 200 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన శివాజీ ‘జాంత రాజా’ నాటకాన్ని ఆయన రచించి, దర్శకత్వం వహించారు. ఇది కేవలం మహారాష్ట్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్, గోవాలోనూ ప్రాచుర్యం పొందింది. ఐదు భాషల్లో దీన్ని అనువదించారు. 1970ల్లో శివసేన అధ్యక్షుడు పార్టీ బాల్ ఠాక్రేతో కలిసి పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా