భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం

భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హాంకాంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి తమ దేశానికి విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్‌ ప్రభుత్వం సోమవారం ఓ

Updated : 19 Apr 2021 11:10 IST

హాంకాంగ్‌: భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హాంకాంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి తమ దేశానికి విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్‌ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్‌, ఫిలిప్పైన్స్‌ నుంచి విమాన రాకపోకల్ని కూడా నిషేధించింది. ‘భారత్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పైన్స్‌ దేశాల నుంచి విమాన రాకపోకల్ని నిషేధించేందుకు నిర్ణయించాం. ఏప్రిల్‌ 20 నుంచి 14 రోజుల పాటు ఆయా దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్‌ విమానాలకు అనుమతి రద్దు చేస్తున్నాం. ఆయా దేశాల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉంది. డిసీజ్‌ కంట్రోల్‌ విభాగం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హాంకాంగ్‌ ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది.

భారత్‌లో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రోజువారీ కేసులు 2లక్షలకుపైగా.. మరణాలు  వెయ్యికిపైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని