రూమ్ స్విట్జర్లాండ్ది.. బాత్రూమ్ ఫ్రాన్స్ది..!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. కొన్ని హోటళ్లలో భోజనం చాలా బాగుంటుంది. మరికొన్ని హోటళ్లలో భిన్నమైన సేవలు కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఒక్కో హోటళ్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే, స్విట్జర్లాండ్లో జెనీవాకు
(ఫొటో: గూగుల్ స్ట్రీట్ వ్యూ)
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. కొన్ని హోటళ్లలో భోజనం చాలా బాగుంటుంది. మరికొన్ని హోటళ్లలో భిన్నమైన సేవలు కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఒక్కో హోటళ్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే, స్విట్జర్లాండ్లో జెనీవాకు సమీపంలోని లా క్యూర్ అనే గ్రామంలో ఉన్న ఓ హోటల్ భవనమే ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎలాగంటే.. ఆ హోటల్ ముందు నిలబడితే ఒక దేశంలో, లోపలికి వెళ్తే మరో దేశంలో అడుగుపెట్టినట్టు. ఒక గది ఒక దేశానికి చెందితే.. అందులోని బాత్రూం మరో దేశానికి చెందితుంది. విచిత్రంగా ఉంది కదా..!
వాల్లీ డెస్ డప్పెస్ అనే ప్రాంతం ఒకప్పుడు స్విట్జర్లాండ్ ఆధీనంలో ఉండేది. దాన్ని సొంతం చేసుకోవాలని ఫ్రాన్స్ పలుమార్లు ప్రయత్నించింది. చివరికి 1862లో స్విట్జర్లాండ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. తమకు వాల్లీ డెస్ డప్పెస్ను స్వాధీనం చేస్తే.. అంతే విస్తీర్ణం ఉన్న మరో ప్రాంతాన్ని అప్పగిస్తామని ఫ్రాన్స్ చెప్పింది. ఇందుకు స్విట్జర్లాండ్ అంగీకరించడంతో లా క్యూర్ గ్రామంలో కొంత భాగాన్ని ఫ్రాన్స్ ఇచ్చేసింది. అయితే ఈ గ్రామం ఇరుదేశాల మధ్యలో ఉండటంతో గ్రామం రెండుగా చీలిపోయింది. కొందరు ఫ్రాన్స్ దేశంలోనే ఉండగా.. మరికొందరు స్విట్జర్లాండ్ పౌరులుగా మారిపోయారు. అయితే, ఒప్పందం ప్రకారం.. అప్పటికే నిర్మించిన ఇళ్లను విభజించే వీలు లేదు.
ప్రభుత్వం కళ్లు గప్పి నిర్మాణం
1862 ఒప్పందంలోని నిబంధనను ఆసరాగా చేసుకున్న అప్పటి ఫ్రాన్స్కు చెందిన వ్యాపారవేత్త పొంతుస్.. ప్రభుత్వాలు సరిహద్దులను మార్చడానికి ముందే మూడంతస్తుల భవనం నిర్మించేశాడు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దు మధ్యలో ఈ భవనం నిర్మిస్తే.. అది పర్యటకుల్ని బాగా ఆకట్టుకుంటుందని పొంతుస్ భావించాడు. ఈ మేరకు భవనంలో స్విట్జర్లాండ్ వైపు సరుకుల దుకాణం, ఫ్రాన్స్ వైపు బార్ ప్రారంభించాడు. 1921 నాటికి పొంతుస్ వారసులు ఈ భవన నిర్వహణ చూసుకోలేక జుల్స్-జీన్ అర్బెజ్ అనే వ్యక్తికి విక్రయించారు.
హోటల్గా మార్చి.. ఆకట్టుకొని
జుల్స్-జీన్ అర్బెజ్.. ఈ భవనాన్ని ‘ది హోటల్ అర్బెజ్’ పేరుతో హోటల్గా మార్చేశాడు. దీంతో ఈ హోటల్ రెండు దేశాల మధ్య ఉండి.. పర్యటకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ హోటల్లో దాదాపు అన్ని గదులు రెండుగా విభజించి ఉంటాయి. హోటల్లోని బార్ ఫ్రాన్స్కు చెందింది కాగా.. బార్ ముఖద్వారం నుంచి మిగతా ప్రాంతమంతా స్విట్జర్లాండ్దే. ఆ హోటల్లోని ప్రత్యేక హనీమూన్ సూట్ గది కూడా రెండుగా విభజించి ఉంటుంది. మంచంపై రెండు దిండ్లలో ఒక దిండు ఫ్రాన్స్, మరో దిండు స్విట్జర్లాండ్ జాతీయ పతాకాల రూపంలో ఉంటాయి. మెట్లలో కింది మెట్లు ఫ్రాన్స్కు, పై మెట్లు స్విట్జర్లాండ్కు చెందుతాయి. మరో గదిలో పడక, ఇతర ప్రాంతమంతా స్విట్లర్లాండ్కు, బాత్రూమ్ ఫ్రాన్స్కు చెందుతుంది. ఈ హోటల్ చిరునామాను ఇరు దేశాలు తమ దేశంలో ఉన్నట్లుగానే రాసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ హోటల్ యాజమాన్యం ఆదాయ పన్నును ఇరు దేశాలకు సమానంగా చెల్లించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..