కరోనాపై కంగారూ వర్సెస్ డ్రాగన్..!
చైనాపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఆస్ట్రేలియాను చూస్తే అర్థమవుతుంది. చైనా తన ఆర్థిక శక్తి బలప్రదర్శనకు వేదికగా ఆస్ట్రేలియాను ఎంచుకొంది. దీంతో ఆసీస్ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడింది.
ఆస్ట్రేలియాపై చైనా ప్రతాపం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: చైనాపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఆస్ట్రేలియాను చూస్తే అర్థమవుతుంది. చైనా తన ఆర్థిక శక్తి బలప్రదర్శనకు వేదికగా ఆస్ట్రేలియాను ఎంచుకొంది. దీంతో ఆసీస్ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడింది.
ప్రపంచం మొత్తం కొవిడ్ పాకడం వెనుక చైనా నిర్లక్ష్యం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతిని చైనాపై గుర్రుగా ఉన్నాయి. కొవిడ్ పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తు నిర్వహించాలని ఆస్ట్రేలియా ధైర్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థను నిలదీసింది. ఇది డ్రాగన్కు కోపం తెప్పించింది. ఆస్ట్రేలియాకు తన బలం ఏమిటో రూచి చూపించాలనుకుంది. అన్ని వైపుల నుంచి ఆసీస్ను నిస్సహాయంగా మార్చేలా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే కఠినమైన వాణిజ్య ఆంక్షలను తీసుకురావడంతోపాటు.. ఆస్ట్రేలియా ఎగుమతులపై దష్ప్రచారం చేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
దిగుమతులపై ఆంక్షలు..
ఆస్ట్రేలియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనా. ఏటా దాదాపు 150 బిలియన్ డాలర్ల విలువైన బొగ్గు, ఎల్ఎన్జీ, ఐరన్ఓర్, వైన్, మాంసం వంటివి ఆస్ట్రేలియా ఎగుమతి చేస్తుంది. వీటిల్లో అత్యధికభాగం చైనాకు ఎగుమతి అవుతాయి. మొత్తం ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 55శాతం చైనాకు వెళతాయి. అంటే ఆస్ట్రేలియాలో అత్యధిక మంది ఉపాధికి చైనా పరోక్షంగా కారణం అవుతోంది. ఈ విషయం బాగా తెలిసిన డ్రాగన్ ఆసీస్ నోరు నొక్కడానికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఆయుధంగా చేసుకొంది. ఆస్ట్రేలియా ఉత్పత్తులను వేరే వాటితో భర్తీ చేస్తామంటూ తొలుత చైనా హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత ఆసీస్ నుంచి వచ్చే బొగ్గు, బార్లీ, కాపర్, చక్కెర, కలప, వైన్ వంటి వాటిని కొన్ని నెలల కిందటి నుంచి అప్రకటిత బ్లాక్లిస్ట్లో చేర్చింది. చైనా వ్యాపారులు వీటిని కొనుగోలు చేయకుండా మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తనకు అవసరమైన ఐరన్ ఓర్, ఎల్ఎన్జీలను మాత్రమే అనుమతిస్తోంది.
మొత్తం ఆసీస్ ఎగుమతుల్లో 9శాతం బొగ్గు నుంచే లభిస్తుంది. తూర్పు ఆస్ట్రేలియాలోని గనుల నుంచి ఇది చైనాకు వెళుతుంది. ఇది చాలా పెద్దమొత్తం. ఆసీస్ నుంచి వచ్చే బొగ్గు నౌకలను అన్లోడింగ్ చేయనీయకుండా పోర్టుల్లో నెలల కొద్దీ నిలిపేసింది. జూన్-జులై మధ్యలో చైనా చేరుకొన్న నౌకల్ని బొగ్గు అన్లోడ్ చేయనీయకండా ఆపేసింది. దీంతో సిబ్బంది వాటిల్లోనే నెలలకొద్దీ ఉండిపోయారు. ఇక్కడే ఉన్న ఎంవీ అనస్తాసియా, జగ్ ఆనంద్ అనే రెండు నౌకల్లో పదుల సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు. తాజాగా మానవతా దృక్పథంతో వాటిల్లోని బొగ్గును అన్లోడ్ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు చైనా పేర్కొంది. 8.5లక్షల టన్నుల కోకింగ్కోల్ అన్లోడ్ చేయనున్నారు. దీంతో కొన్నిరోజుల క్రితం భారతీయు సిబ్బంది కూడా వెనక్కి వచ్చారు. 2020లో చైనా 306 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంది. వీటిల్లో 57శాతం థర్మల్ కోల్, 40శాతం కోకింగ్ కోల్ ఆసీస్ నుంచి వచ్చింది.
కుదేలైన ఆసీస్ వైన్ వ్యాపారం
ఆస్ట్రేలియా వైన్పై చైనా ఆంక్షల కత్తిని దూసింది. ఆస్ట్రేలియా సంస్థలు కారుచౌకగా వైన్ను డంప్ చేస్తున్నాయంటూ వైన్ తయారీ సంస్థలపై నవంబర్లో యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించింది. దీంతో డిసెంబర్లో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. వాస్తవానికి ఆసీస్లో తయారయ్యే వైన్కు చైనానే అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్ విలువ సుమారు 840 మిలియన్ డాలర్లు. ఏప్రిల్లో ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ కొవిడ్పై అంతర్జాతీయ దర్యాప్తు కోరినప్పటి నుంచి చైనా ఆగ్రహంగా ఉంది. ఒక దశలో ఆస్ట్రేలియాలోని చైనా దౌత్యవేత్త చెన్ జింగీ స్పందిస్తూ.. ఆసీస్ ఆర్థికంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘ఆసీస్ బీఫ్ ఎందుకు తినాలి.. ఆసీస్ వైన్ ఎందుకు తాగాలి’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే బీఫ్, వైన్ బొగ్గుపై ఆంక్షలు విధించారు. ఆసీస్ వైన్ తరలిస్తున్న నౌకలు నెలల కొద్దీ చైనా తీరంలో నిలిచిపోయిన ఘటనలు ఉన్నాయి. దీంతోపాటు భారీ సుంకాలను విధించింది.
ఆసీస్పై దుష్ప్రచారం..!
ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెడ్డపేరు తెచ్చేలా ఏకంగా చైనా విదేశాంగశాఖ సిబ్బందే ప్రచారానికి తెరలేపారు. ఆస్ట్రేలియా సైనికులు అఫ్గానిస్థాన్లో అరాచకం సృష్టిస్తున్నారంటూ గత నవంబర్లో చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు. ఇవి పెను సంచలనానికి దారితీశాయి. చివరికి ఆ ఫొటోలు ఎడిట్ చేసినవిగా తేలాయి.
ఇక కరోనా వైరస్ పుట్టుక కూడా ఆస్ట్రేలియాలోనే జరిగిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు కూడా చైనా ప్రయత్నించింది. ఆసీస్ నుంచి దిగుమతి అయిన శీతలీకరించిన గొడ్డుమాంసం నుంచి కరోనా వ్యాపించించి ఉంటుందని చైనా పర్యటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందంతో ఓ అనుమానం వ్యక్తం చేయించింది. ఇలాంటి వాదనే గతంలో చైనా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కూడా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే