China: జిన్పింగ్ గర్వించేలా ఆమె..!
హాంకాంగ్ పూర్తిగా చైనా ఉక్కు పిడికిట్లోకి వెళ్లిపోతోంది. హాంగ్కాంగ్ సెక్యూరిటీ లా పేరిట చైనా రుద్దిన బలవంతం చట్టం అక్కడి ప్రజల నోళ్లను మూయించేస్తోంది. నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని రద్దు చేయాలంటూ
మినీ చైనాను తలపించేలా హాంకాంగ్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
హాంకాంగ్ పూర్తిగా చైనా ఉక్కు పిడికిట్లోకి వెళ్లిపోతోంది. హాంకాంగ్ సెక్యూరిటీ లా పేరిట చైనా రుద్దిన బలవంతపు చట్టం అక్కడి ప్రజల నోళ్లను మూయించేస్తోంది. నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని రద్దు చేయాలంటూ ప్రజలు చేసిన ఉద్యమాన్ని చూసి భయంతో కన్నీటి పర్యంతమైన హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెరీ లామ్.. ఇప్పుడు విజృంభిస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యమకారులను అరెస్టు చేసి జైళ్లల్లో బంధిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా మెల్లగా ఈ ఆంక్షలను అలవాటు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. స్వేచ్ఛాయుత ప్రదేశంగా హాంకాంగ్కు ఉన్న గుర్తింపు కనుమరుగవుతోందన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని సర్దుకుపోతున్నారు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల గ్వాంగ్జూలో మాట్లాడుతూ మరో బాంబు పేల్చారు. ఆన్లైన్లో భావప్రకటనను నియంత్రించనున్నట్లు వెల్లడించారు.
ఇంటర్నెట్, మీడియాను అదుపు చేస్తూ..
ఇంటర్నెట్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రస్తుత చట్టాలతో ప్రయోజనం లేదని కెరీ లామ్ అన్నారు. వేర్పాటువాదం, విష ప్రచారం చేసేవారిని అరికట్టేందుకు ‘ఫేక్ న్యూస్’ చట్టాన్ని మేలో అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనిలో చట్టపరమైన అంశాలపై పరిశీలన జరుగుతోంది. దీంతోపాటు సైబర్ సెక్యూరిటీ లా కూడా తయారు చేయడానికి హాంకాంగ్ సిద్ధమైపోయింది. ఇందులో ఇంటర్నెట్ ప్రొవైడర్లను కీలకమైన మౌలిక సదుపాయాలుగా వర్గీకరించనున్నారు. ఫలితంగా ఆన్లైన్ కంటెంట్పై ప్రభుత్వానికి బలమైన పట్టు లభిస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే చైనా ఆమోదించిన నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని హాంకాంగ్ అధికారులు ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం కింద వేర్పాటువాదం, విదేశీ శక్తులతో కుమ్మక్కవ్వడం, తీవ్రవాదం వంటి వాటిని నేరాలుగా పరిగణించి శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. చైనా నుంచి హాంకాంగ్ను వేరు చేయడంపై మాట్లాడటం, రాయడం వంటివి చేయడం నేరం. అటువంటి మీడియా హౌసులను మూసివేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దీంతో హాంకాంగ్ అధికారులు దీనిని కళాశాలలు, మ్యూజియంలు, సినీ నిర్మాతలపై ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడి పరిస్థితి ఏ స్థాయికి చేరుతుందో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి.
కీలక సంస్థలు పలాయనం..
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఒక్క ఏడాదే 47 విదేశీ సంస్థల ప్రాదేశిక ప్రధాన కార్యాలయాలు హాంకాంగ్ నుంచి తొలగించారు. వీటిల్లో అమెరికా, జపాన్, ఫ్రాన్స్ దేశాల కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. 6 ప్రపంచ స్థాయి బ్యాంకులు, 4 అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు వీటిలో ఉన్నాయి. కానీ, 14 చైనా కంపెనీల రీజనల్ ఆఫీస్లు కొత్తగా వచ్చి చేరాయి. ‘‘చైనా ప్రధాన భూభాగంలో వ్యాపారం చేయడం ఎంత రిస్క్తో కూడుకున్నదో.. అంతే రిస్క్ హాంకాంగ్లో కూడా ఉందని భావిస్తున్నాం’’ అని ఓ అంతర్జాతీయ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్షియల్ టైమ్స్ వద్ద వ్యాఖ్యానించారు. చైనాలో మాదిరిగా దీర్ఘకాలం సరిహద్దులు మూసివేయడం, కఠినమైన క్వారంటైన్ నిబంధనల కారణంగా కంపెనీలు ఈ ప్రాంతాన్ని వీడుతున్నాయి.
చైనా కబంధ హస్తాల్లోకి హాంకాంగ్..
* 1997లో హాంకాంగ్ నిర్వహణ బాధ్యతలను బ్రిటన్ నుంచి చైనాకు అప్పజెప్పారు. 2047 వరకు హాంకాంగ్ రాజ్యాంగం అమల్లో ఉండాలి.
* 2014లో ప్రజాస్వామ ఉద్యమైన అంబ్రిల్లా ఉద్యమం చోటు చేసుకొంది.
* 2019లో చైనాకు నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం జరిగింది. అదే ఏడాది సెప్టెంబర్లో ఈ బిల్లు ఉపసంహరిస్తామని హాంకాంగ్ సీఈవో కెరీ లామ్ ప్రకటించారు.
* 2020 మార్చిలో కొవిడ్ వ్యాప్తితో హాంకాంగ్ సరిహద్దులు మూసివేసింది. దీంతో చైనా, ఇతర ప్రపంచ దేశాలతో సంబంధాలు తెగిపోయాయి.
* 2020 జూన్లో స్థానిక చట్టాలను పక్కకు తప్పిస్తూ బీజింగ్ నేషనల్ సెక్యూరిటీ లాను విధించింది.
* 2020లో ఐరోపా సంఘంతో ఉన్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు, పరస్పర న్యాయ సహకార ఒప్పందాలను హాంకాంగ్ రద్దు చేసుకొంది.
* 2021 జనవరిలో 50 మందిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి జైల్లో వేసింది.
* 2021 మార్చిలో హాంకాంగ్ ఎన్నికల విధానంలో చైనా మార్పులు చేయడం మొదలుపెట్టింది.
* హాంకాంగ్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం రిస్క్గా పేర్కొంటూ అమెరికా 2021 జులైలో అడ్వైజరీ జారీ చేసింది.
* 2021 ఆగస్టులో సరిహద్దులను తెరవాలని ఐరోపా సమాఖ్య కోరింది.
* చైనాతో సరిహద్దులు తెరవడం తమ ప్రాధాన్యమని హాంకాంగ్ సీఈవో కెరీ లామ్ ప్రకటించారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ