రికవరీ@21 రోజుల్లో 100% పెరుగుదల

టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచడం, సమర్థవంతమైన ట్రాకింగ్‌, మెరుగైన వైద్య సదుపాయాలు తదితర చర్యలతో భారత్‌లో కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా

Published : 23 Aug 2020 02:32 IST

దిల్లీ : టెస్టుల సంఖ్య భారీగా పెంచడం, సమర్థవంతమైన ట్రాకింగ్‌, మెరుగైన వైద్య సదుపాయాలు తదితర చర్యలతో భారత్‌లో కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 65 వేలకుపైగా కేసులు నమోదవుతున్నప్పటికీ.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం ఆస్పత్రులపై భారాన్ని తగ్గిస్తోంది. 

తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 63,631 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 22,22,577కి చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి.

మరోవైపు గత 21 రోజుల్లో కోలుకుంటున్న వారి సంఖ్య వంద శాతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ట్విటర్‌లో తెలిపింది. ఈ నెల 1 నాటికి కోలుకున్న వారి సంఖ్య 10,94,374గా ఉండగా.. 10 నాటికి 15 లక్షలు దాటింది. 21 నాటికి ఆ సంఖ్య 21,58,946కి చేరింది. తాజాగా మరో 63 వేల మంది కోలుకోగా ఆ సంఖ్య 22 లక్షలు దాటింది. దీంతో రికవరీ రేటు భారత్‌లో 74.69 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.87కి తగ్గింది. ప్రస్తుతం నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు నాలుగో వంతు కంటే తక్కువగా(23.43 శాతం) ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని