Afghanistan Crisis : డబ్బుల్లేని బ్యాంకుల ముందు ప్రజల ఆర్తనాదాలు..
వేలాది మంది ప్రజలు కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు చేరుకొని తరలింపు కోసం ఎదురుచూపులు, దాదాపు ఆర్నెళ్లుగా అందని వేతనాల కోసం వందలాది మంది ఉద్యోగులు బ్యాంకుల ఎదుట ఆందోళనల దృశ్యాలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.....
కాబుల్లో హృదయ విదారక పరిస్థితులు
ఇంటర్నెట్ డెస్క్: తాలిబన్ల స్వాధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజల జీవనం రోజురోజుకీ మరింత దుర్భరంగా మారుతోంది. తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో, ఏవైపు నుంచి ఏ ఉగ్రమూక ఆత్మాహుతి దాడులకు తెగబడుతుందో తెలియక అక్కడి జనం నిత్యం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ రాక్షస మూకల పాలనలో మగ్గిపోవడం ఇష్టంలేని అక్కడి ప్రజలు.. ఇన్నాళ్లూ బతికిన అఫ్గాన్ను వీడి పారిపోయేందుకు చేస్తున్న ప్రయత్నంలో అనేక అవస్థలు పడుతున్నారు. దీంతో అక్కడి మహిళలు, చిన్నారుల పరిస్థితి మరింత హృదయ విదారకంగా మారింది. వేలాది మంది ప్రజలు కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు చేరుకొని తరలింపు కోసం ఎదురుచూపులు, దాదాపు ఆర్నెళ్లుగా అందని వేతనాల కోసం వందలాది మంది ఉద్యోగులు బ్యాంకుల ఎదుట ఆందోళనల దృశ్యాలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.
ఏటీఎంల వద్ద భారీ క్యూలు
ఇదిలా ఉండగా.. తమ జీతాల కోసం ఉద్యోగులు బ్యాంకుల ముందు ఆందోళన దిగడం.. సామాన్యులు ఏటీఎం యంత్రాల వద్ద తమ డబ్బులు విత్డ్రా చేసుకొనేందుకు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు అక్కడి దారుణ పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. న్యూ కాబుల్ బ్యాంకు ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గత మూడు నుంచి ఆర్నెళ్ల పాటు పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం బ్యాంకులు పునఃప్రారంభమైనప్పటికీ ఎవరూ డబ్బులు విత్ డ్రా చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే బ్యాంకుల్లో నగదు నిల్వలు లేవని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఏటీఎం యంత్రాలు పనిచేస్తున్నప్పటికీ నగదు ఉపసంహరణపై పరిమితులు విధించడంతో జనానికి తిప్పలు తప్పడంలేదు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు ఏటీఎం కేంద్రాల వద్దకు చేరుకొని క్యూలలో గంటల తరబడి వేచిచూస్తున్నారు.
చిన్నారులకు నీళ్లు ఇస్తున్న జవాన్ వీడియో వైరల్..
అఫ్గాన్లో అల్లకల్లోలం, గందరగోళ పరిస్థితుల మధ్య అక్కడి వీధుల్లో చిక్కుకుపోయినవారి పట్ల కొందరు జవాన్లు మానవతా దృక్పథంతో సాయం చేస్తున్నారు. ఓ జవాను చిన్నారులకు నీళ్లు అందిస్తున్న వీడియో వైరల్గా మారింది. సానుభూతి, మానవత్వం, ఒకరికి ఒకరు అండగా నిలవడం ఆదాయం కన్నా, వృద్ధి కన్నా ముఖ్యమైంది అంటూ భారత మాజీ సైనికుడు రాజ్ సహా పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారుతోంది.
ఎంబసీ మూసివేసిన ఆస్ట్రేలియా
మరోవైపు, అఫ్గానిస్థాన్లో తమ రాయబార కార్యాలయాన్ని ఆస్ట్రేలియా మూసివేసింది. అక్కడి నుంచి సిబ్బందిని ఉపసంహరించుకొంది. అఫ్గాన్లో చిక్కుకున్న అనేక మంది పౌరులు ఆస్ట్రేలియా తిరిగి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే, కాబుల్ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్ల తర్వాత తమ పౌరులను రప్పించేందుకు ఉత్తమ మార్గాలను రూపొందిస్తున్నట్టు భారత్లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ బార్రీ ఓఫార్రెల్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు