Wildfire: ఆగని కార్చిచ్చు.. కళ్ల ముందే ఆహుతవుతున్న కలల సౌధాలు!

పలు దేశాల్లో బెంబేలెత్తిస్తున్న కార్చిచ్చు.. వేలాది కుటుంబాలను రోడ్డుపైకి తీసుకొచ్చింది. కట్టుకున్న కలల సౌధాలు కళ్ల ముందే మంటల్లో ఆహుతవుతుంటే గ్రీస్‌ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తూ రోదిస్తున్నారు. చేసేది లేక ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రాల్లో కాలం వెళ్లదీస్తున్నారు...

Published : 08 Aug 2021 12:41 IST

ఏథెన్స్‌: పలు దేశాల్లో బెంబేలెత్తిస్తున్న కార్చిచ్చు.. వేలాది కుటుంబాలను రోడ్లపైకి తీసుకొచ్చింది. కట్టుకున్న కలల సౌధాలు కళ్ల ముందే మంటల్లో ఆహుతవుతుంటే గ్రీస్‌ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తూ రోదిస్తున్నారు. చేసేది లేక ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. గత కొన్ని రోజులుగా గ్రీస్‌లో చెలరేగుతున్న మంటలు శనివారం మరింత ఉగ్రరూపం దాల్చాయి. దాదాపు 1450 మంది అగ్నిమాపక సిబ్బంది.. విమానాలతో మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌కు ఉత్తర దిశగా ఉన్న ప్రెస్‌కొఫిటో అనే ప్రాంతానికి చెందిన ఓ పెన్షనర్‌ మాట్లాడుతూ.. ‘‘బహుశా మా ఇళ్లు ఉన్న ప్రాంతానికి మా మునిమనవళ్లే వెళ్లగలరు’’ అంటూ బోరున విలపించారు. దీన్ని బట్టి అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రీస్‌కు అండగా నిలిచేందుకు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఈజిప్టు, స్పెయిన్‌ ముందుకు వచ్చాయి. మరోవైపు టర్కీలో వర్షాలు కురుస్తుండడంతో కార్చిచ్చు కాస్త అదుపులోకి వచ్చింది.

గ్రీస్‌లో గత 10 రోజుల్లో 56,655 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. అధిక ఉష్ణోగ్రతలు, భారీ గాలుల నేపథ్యంలో మంటలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మంటల కారణంగా గ్రీస్‌లో ఇద్దరు చనిపోగా.. టర్కీలో 8 మంది మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని