Poonch encounter: కార్మికులు ఇచ్చిన సమాచారంతో పూంచ్ ఎన్కౌంటర్..!
అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని కొందరు కార్మికులు సైన్యానికి ఉప్పందించడంతో పూంచ్ ఎన్కౌంటర్ మొదలైంది. అక్టోబర్ 10తేదీన ఇద్దరు వ్యక్తులు భారీ తుపాకులతో పూంచ్లోని ఓ లేబర్ క్యాంప్కు వెళ్లారు..
ఇంటర్నెట్డెస్క్: అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని కొందరు కార్మికులు సైన్యానికి ఉప్పందించడంతో పూంచ్ ఎన్కౌంటర్ మొదలైంది. అక్టోబర్ 10తేదీన ఇద్దరు వ్యక్తులు భారీ తుపాకులతో పూంచ్లోని ఓ లేబర్ క్యాంప్కు వెళ్లారు.. అక్కడ ఓ కూలీ నుంచి ఫోన్ లాక్కొని సమీపంలోని ఆర్మీ క్యాంప్ దిశగా వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అక్కడి కూలీలు సైన్యానికి తెలియజేశారు. దీంతో ఆ ఫోన్పై నిఘా పెట్టిన అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆ ఫోన్ పూంచ్-రాజౌరీ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్నట్లు తేలింది. ఫోన్ సంభాషణలను కూడా సైన్యం విని ఉగ్రవాదులు ఉన్న విషయాన్ని ధ్రవీకరించుకొని ఆపరేషన్ మొదలుపెట్టింది. తనిఖీలు మొదలుపెట్టిన ఒక్క రోజులోనే ఐదుగురు సభ్యులను భద్రతా దళాలు కోల్పోయాయి.
ఉగ్రవాదులకు సాయం చేసి పారిపోతుండగా..
మెందహార్, పూంచ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వీరు పూంచ్, మెందహార్ వద్ద ఎన్కౌంటర్లో ఉగ్రవాదులకు అవసరమైన వస్తువులను సరఫరా చేసినట్లు గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ మీదుగా నేపాల్కు పారిపోతున్న సమయంలో అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.
ఉగ్రవాదులతో టచ్లో పాక్ మాజీ సైనికులు..
పాకిస్థాన్కు చెందిన మాజీ సైనిక సిబ్బంది పూంచ్ ఎన్కౌంటర్లో పాల్గొన్న ఉగ్రవాదులతో నిరంతరం టచ్లో ఉన్నట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. 2008 డిసెంబర్ - 2009 జనవరి మధ్య తొమ్మిది రోజులపాటు బాతా దురియా ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అప్పట్లో ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు. ఈ సారి కూడా ఉగ్రవాదులు పారిపోయే అవకాశం ఉందని దళాలు అనుమానిస్తున్నాయి.
కీలక దశకు ఎన్కౌంటర్..
దాదాపు 16 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్ కీలక దశకు వచ్చినట్లు రక్షణ శాఖ వర్గాలు ఓ ఆంగ్ల పత్రికకు తెలియజేశాయి. అదనపు బలగాలను కూడా ఎన్కౌంటర్ స్థలానికి తరలించి గుహల్లో కూంబింగ్ నిర్వహించి అనుమానం ఉన్న చోట్ల నిప్పుపెట్టడం, లేదా పేలుడు పదార్థాలను వాడి శానిటైజ్ చేస్తున్నారు. ఉగ్రమూక ఎన్కౌంటర్ స్థలం నుంచి తప్పించుకొన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
చిక్కటి అడవుల్లో పశువుల కాపర్లు తాత్కాలిక గృహాలు నిర్మించుకొన్నారని జమ్ము అండ్ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులు వీటిని వినియోగిస్తూ దాక్కొంటున్నారని అన్నారు. అంతేకాదు అడవులు చిక్కగా ఉండటంతో భద్రతా దళ సభ్యులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే