పెట్రోల్‌, విద్యుత్‌తో నడిచే బైక్‌!

పెట్రోల్‌ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో ప్రజలు ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం

Published : 21 Jul 2021 21:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్రోల్‌ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం అందరూ విద్యుత్‌తో నడిచే వాహనాలు వైపు మొగ్గు చూపుతుండగా.. గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు పెట్రోల్‌, విద్యుత్‌తో నడిచే బైక్‌ను తయారు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. రాజ్‌కోట్‌లోని వీవీపీ ఇంజనీరింగ్‌ కళాశాల చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు పెట్రోల్‌ అయిపోయినా బ్యాటరీ సాయంతో దూసుకుపోయే హైబ్రిడ్‌ బైక్‌ తయారు చేశారు. ఈ బైక్‌లో నాలుగు వేర్వేరు బ్యాటరీలు అమర్చారు. ఒక బ్యాటరీ ఛార్జ్‌ అవ్వడానికి ఆరు గంటల సమయం పట్టగా.. పూర్తి ఛార్జింగ్‌ ఉన్న బ్యాటరీ సాయంతో ఏకధాటిగా 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో షికారు చేయొచ్చు. హ్యండిల్‌కి ఏర్పాటు చేసిన స్విచ్‌ సాయంతో పెట్రల్‌ నుంచి విద్యుత్‌కి లేదా విద్యుత్‌ నుంచి పెట్రోల్‌కు మారొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని