Amit Shah: గుజరాతీ కంటే హిందీ భాషనే ప్రేమిస్తా
గుజరాతీ కంటే హిందీ భాషనే ప్రేమిస్తానని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. శనివారం ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో నిర్వహించిన అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
వారణాసి అఖిల భారతీయ రాజ్భాషా సమ్మేళనంలో అమిత్ షా
వారణాసి: గుజరాతీ కంటే హిందీ భాషనే ప్రేమిస్తానని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. శనివారం ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో నిర్వహించిన అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘భారతీయులందరూ రాజ్భాష (అధికార భాష)ని బలోపేతం చేసుకోవాలి. తల్లిదండ్రులందరూ మీ పిల్లలతో మాతృభాషల్లోనే మాట్లాడండి. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన మాతృభాష మనకు గర్వకారణం. కేంద్ర హోంశాఖలో ఒక్క ఫైల్ కూడా ఇంగ్లీష్లో రాయడం, చదవడం చేయడం లేదు. ఇది చెప్పడానికి గర్వంగా ఉంది. అనేక శాఖలు కూడా ఇదే దిశగా కొనసాగుతున్నాయి. పరిపాలనా భాష.. స్వభాష, అధికార భాష అయినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా మార్చారు. దానికి మూడు స్తంభాలు ఉన్నాయి స్వరాజ్, స్వదేశీ,స్వభాష. అందులో స్వరాజ్యాన్ని సాధించాం కానీ స్వదేశీ స్వభాష మాత్రం వెనుకబడిపోయాయి. హిందీ భాష, స్థానిక భాషల మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీకి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది’’ అన్నారు. ప్రాంతీయ భాషల్లో కాకుండా విదేశీ భాషల్లో పరిశోధనలు జరగడం వల్లే దేశం వెనుకబడిపోయిందన్న అమిత్ షా దీని గురించి వివరిస్తూ ‘‘ నూతన జాతీయ విద్యా విధానం ప్రాంతీయ భాషపై దృష్టి పెడుతుంది. అలాగే, ప్రతి రాష్ట్ర చరిత్రను అధికారిక భాషలోకి అనువదించాలి’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం