MK Stalin: ఎవరైనా అలా చేస్తే నేనే డిక్టేటర్‌గా మారతా.. చర్యలు తీసుకుంటా : సీఎం స్టాలిన్‌

రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు తమిళనాడు సీఎం స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తన పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడితే తానే నియంతలా మారి..

Updated : 04 Jul 2022 17:51 IST

ప్రజాప్రతినిధులను హెచ్చరించిన తమిళనాడు సీఎం

చెన్నై: రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తన పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడితే తానే నియంతలా(డిక్టేటర్‌) మారి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు నామక్కల్‌లో జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

‘‘నేను ప్రజాస్వామికవాదిగా మారినట్లు నా సన్నిహితులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎదుటివారి అభిప్రాయాలు వినడం.. వాటిని గౌరవించడం. మనకు నచ్చిందే చేయడం ప్రజాస్వామ్యం కాదు. అలా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎవరైనా క్రమశిక్షణారాహిత్యంగా మెదులుతూ అక్రమాలకు పాల్పడితే మాత్రం సహించను. నేనే నియంతగా మారి కఠిన చర్యలు తీసుకుంటా. ఈ విషయం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే చెప్పడం లేదు. ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను’’ అని స్టాలిన్‌ హెచ్చరించారు.

అలాగే కొత్తగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు తమ బాధ్యతలను.. భర్తలకు అప్పగించరాదని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు.. చట్టానికి కట్టుబడి ప్రజలకు సేవ చేయాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్టాలిన్ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని