Prabhakaran: పెద్దపులి బతికే ఉందా.. అయితే కలిసొస్తాంలే: కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ (Prabhakaran) బతికే ఉంటే తాను స్వయంగా వెళ్లి కలుస్తానని అంటున్నారు కాంగ్రెస్ తమిళనాడు యూనిట్ అధ్యక్షుడు కేఎల్ అళగిరి. తమ పార్టీ మాజీ నేత చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.
చెన్నై: ఎల్టీటీఈ (LTTE) చీఫ్ ప్రభాకరన్ (Prabhakaran) బతికే ఉన్నారంటూ కాంగ్రెస్ మాజీ నేత పాళ నెడుమారన్ (Pazha Nedumaran) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తమిళనాడు కాంగ్రెస్ (Congress) చీఫ్ కేఎల్ అళగిరి (KS Alagiri) స్పందిస్తూ.. నెడుమారన్పై విమర్శలు చేశారు. ఆయన బతికే ఉంటే.. తాను వెళ్లి కలిసి వస్తానంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకవేళ ప్రభాకరన్ను చూపిస్తే గనుక నేను స్వయంగా వెళ్లి ఆయనను కలిసి వస్తాను. అందులో సమస్యేం లేదు’’ అని అళగిరి మీడియాతో వ్యాఖ్యానిస్తూ తమ పార్టీ మాజీ నేత నెడుమారన్కు కౌంటర్ ఇచ్చారు.
ప్రభాకరన్ (Prabhakaran) సజీవంగానే ఉన్నారని, ఆయన త్వరలోనే బయటకు వస్తారని తమిళ జాతీయోద్యమ నేత పాళ నెడుమారన్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమిళ ఈలం (Tamil Eelam) ప్రజల కోసం ఆయన త్వరలోనే తన ప్రణాళికలను వెల్లడిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రభాకరన్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
శ్రీలంక తమిళుల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వేలుపిళ్లై ప్రభాకరన్ 1970ల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ LTTE) అనే సంస్థను స్థాపించాడు. ఈ పోరాటంలో భాగంగా ఈ సంస్థ శ్రీలంకలో పోలీసులు, మిలిటరీ దళాలపై అనేక దాడులు చేసింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలోనూ ఈ సంస్థ హస్తం ఉంది. ఈ క్రమంలోనే ఎల్టీటీఈ (LTTE)పై కఠిన చర్యలు చేపట్టిన శ్రీలంక (Sri Lanka) ప్రభుత్వం.. అధినేత ప్రభాకరన్ను హతమార్చినట్లు 2009లో ప్రకటించింది. అతడిని పెద్దపులిగా పిలిచేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు