అధికారులను ఒంటెలపై ఊరేగించిన గ్రామస్థులు

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి తమ గ్రామానికి విచ్చేసిన అధికారులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికిన ఘటన మహారాష్ట్రలోని పాలీ జిల్లాలో జరిగింది.

Published : 30 May 2021 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి తమ గ్రామానికి విచ్చేసిన అధికారులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికిన ఘటన మహారాష్ట్రలోని పాలీ జిల్లాలో జరిగింది. రాయ్‌పూర్‌ సబ్ డివిజన్ ప్రాంతంలోని పలు గ్రామాలను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ అధికారీ సందర్శించనేలేదు. ఇందులో సత్రుంగియా అనే గ్రామం కూడా ఉంది. తమ గ్రామానికి ఓసారి రావాలని జిల్లా కలెక్టర్ అన్షదీప్, ఎస్పీ కల్‌రామ్ రావత్‌ను ఆ గ్రామస్థులు కోరారు. అందుకు అంగీకరించిన అధికారులు పెద్ద ఎత్తున సిబ్బందిని వెంటబెట్టుకుని ఆ గ్రామానికి వెళ్లారు. తొలిసారి తమ ప్రాంతానికి తరలివస్తున్న అధికారులకు స్థానికులు విభిన్నంగా స్వాగతం పలికారు. ఒంటెలపై వారిని కూర్చోబెట్టి పూలవర్షం కురిపిస్తూ గ్రామంలోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో  ఆకట్టుకుంటున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని