Gujarat: ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి.. చిక్కుల్లో ఐఏఎస్ అధికారి
గుజరాత్ ఎన్నికలకు పరిశీలకుడిగా నియమితులైన ఓ ఐఏఎస్ అధికారి ఆ విషయాన్ని సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈసీ ఆయనపై చర్యలు చేపట్టింది.
గాంధీనగర్: తన విధులకు సంబంధించి సోషల్మీడియాలో పోస్ట్ పెట్టి ఇబ్బందుల్లో పడ్డారో ఐఏఎస్ అధికారి. ఆ పోస్ట్ కారణంగా ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్నికల విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ను ఈసీ.. గుజరాత్ ఎన్నికలకు పరిశీలకుడిగా నియమించింది. అహ్మదాబాద్లో బాపునగర్, అసర్వా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయన జనరల్ అబ్జర్వర్గా వెళ్లారు. అయితే, ఈ విషయాన్ని తెలియజేస్తూ అభిషేక్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతో పాటు, అధికారిక వాహనం పక్కన నిల్చున్న ఫొటో, తన బృందంతో కలిసి ఉన్న రెండు ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది కాస్తా ఎన్నికల సంఘం దృష్టికి చేరడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ అభిషేక్పై చర్యలు చేపట్టింది. ‘‘ఆ ఐఏఎస్ అధికారి ఇన్స్టా పోస్ట్ను తీవ్రంగా పరిగణిస్తున్నాం. అధికారిక హోదాను ఆయన పబ్లిసిటీ స్టంట్గా ఉపయోగించుకున్నారు. ఆయనను తక్షణమే అబ్జర్వర్ విధుల నుంచి తొలగిస్తున్నాం’’ అని ఈసీ వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేగాక, తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఎన్నికల సంబంధిత విధుల్లోకి తీసుకోకుండా అభిషేక్ను డీబార్ చేసినట్లు తెలుస్తోంది. తక్షణమే నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించిందట. అబ్జర్వర్గా ఆయనకు కేటాయించిన ప్రభుత్వ సదుపాయాలను కూడా తొలగించినట్లు సమాచారం. అభిషేక్ స్థానంలో మరో ఐఏఎస్ అధికారిని నియమించినట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
పద్మ అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు
ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనను చూసి తానెంతో గర్విస్తున్నానని అన్నారు. -
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం
అరవింద్ కేజ్రీవాల్కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, అతనికి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా దిల్లీ ఎయిమ్స్ను కోర్టు ఆదేశించింది. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ (Salman Khan) ఇంటివద్ద జరిగిన కాల్పులకు వాడిన తుపాకీ కోసం సూరత్లోని తపతీ నదిలో గాలింపు చేపట్టారు. -
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
మాజీ ప్రధానులపై మోదీ ఆరోపణలు చేయడంపై ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. -
‘పచ్చని’ పోలింగ్ బూత్.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!
ఎన్నికల వేళ.. ఎండలో నిలబడి ఓటు వేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన ఆకర్షిస్తోంది. -
8 ఏళ్ల జీతం 4 వారాల్లో తిరిగివ్వాలా?.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: మమత
Mamata Banerjee on HC order: ఉపాధ్యాయ నియామక పరీక్ష రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
డీప్ఫేక్ వీడియోపై రణ్వీర్ సింగ్ పోలీస్ కేసు
తాను ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న డీప్ఫేక్ వీడియోపై బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కోర్సు ఎందుకు.. హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేయండి: సుప్రీం ఆగ్రహం
Supreme Court: లా కోర్సును మూడేళ్లకు తగ్గించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు మండిపడింది. అప్పుడు కోర్సులు ఎందుకని.. నేరుగా హైస్కూల్ తర్వాతే ప్రాక్టీస్ చేయండంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బెంగాల్లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు
Teachers recruitment Scam: పశ్చిమ బెంగాల్లో 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష చెల్లదని కోల్కతా హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పరీక్షతో ఉద్యోగాలు సాధించిన టీచర్లంతా తమ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి: 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు
Supreme Court: అత్యాచారానికి గురైన ఓ బాలికకు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించింది. -
ఈరోజు గూగుల్ డూడుల్ గమనించారా? అక్షరాలను పోలి ఉన్న ఆ చిత్రాలేంటో తెలుసా?
Google Doodle: ధరిత్రి దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. దాని అర్థం ఏంటి? ఆ చిత్రాలు ఏం సూచిస్తున్నాయో చూద్దాం..! -
కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలి
మధుమేహంతో బాధపడుతున్న తమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలంటూ ఆదివారం ఆప్ కార్యకర్తలు తిహాడ్ జైలు వెలుపల ఆందోళన నిర్వహించారు. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు
గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరేణ్ సోలంకీ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. -
భిన్న జగతిలో విశ్వబంధుగా భారత్
పంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
సివిల్ సర్వీసెస్ అధికారుల నిబద్ధత తిరుగులేనిది: నరేంద్ర మోదీ
సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ శుభాకాంక్షలు. మన దేశానికి సేవ చేయడంలో వారి నిబద్ధత, కృషి ప్రశంసనీయం. -
సీఆర్పీఎఫ్ బస్సు బోల్తా.. పది మంది జవాన్లకు గాయాలు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా రాయ్కోట్ వద్ద 32 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడింది. -
అవయవ మార్పిడిలో అక్రమాలపై కొరడా!
అక్రమంగా అవయవ మార్పిడి చేస్తున్న ఆసుపత్రులపై దర్యాప్తు జరిపి, ఉల్లంఘనలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్రాలకు స్పష్టంచేసింది. -
ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ అరెస్టు
త్తీస్గఢ్లో రూ.2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది. -
వాతావరణ వార్తలు చదువుతూ.. సొమ్మసిల్లిన న్యూస్ రీడర్
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. -
మహారాష్ట్రలో దివ్యాంగ సిబ్బందితో పోలింగ్ కేంద్రాలు
సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు
-
Kolkata vs Bengaluru: టీవీ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభంలో స్వల్ప క్షీణత.. ఆదాయం 11 శాతం జంప్
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం