ఐసీఎస్ఈ 10, 12పరీక్షలు వాయిదా
కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో ఐసీఎస్ఈ బోర్డు పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి....
దిల్లీ: కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో ఐసీఎస్ఈ బోర్డు పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఐసీఎస్ఈ పది, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ద కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) ఓ ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయాన్ని జూన్ తొలి వారంలో వెల్లడిస్తామని స్పష్టంచేసింది. ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు కాగా.. 12వ తరగతి పరీక్షలను కేంద్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే. సీబీఎస్ఈ పరీక్షల తరహాలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పది తరగతి పరీక్షలు రద్దు చేయడంతో పాటు మిగతా పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
* తెలంగాణలో శనివారం జరగాల్సిన ఎస్సీ గురుకుల ప్రతిభ కళాశాలల రెండో ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా తీవ్రత కారణంగా సీఓఈ రెండో స్క్రీనింగ్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు.
* 2020-21 సంవత్సరానికి గానూ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు గడువును కూడా పొడిగించారు. కొత్త, రెన్యూవల్ దరఖాస్తుల కోసం మే 31 వరకు ఈ పాస్ పోర్టల్ పనిచేయనుందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!