Satyapal malik: నాకేమైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత.. సత్యపాల్ మాలిక్
కేంద్రం తనకు Z+ కేటగిరీ భద్రతను కుదించిందని.. ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు.
దిల్లీ: తనకు కల్పించిన జెడ్ ప్లస్(Z+) కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవడంపై జమ్మూకశ్మీర్(Jammu kashmir) మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satyapal malik) కేంద్రంపై మండిపడ్డారు. తన భద్రతను కుదించి ఓ పర్సనల్ సెక్యూరిటీ అధికారి(పీఎస్వో)ని ఇచ్చినా.. అతడు మూడు రోజులుగా రాలేదన్నారు. ఎవరైనా తనపై దాడిచేయవచ్చని.. తనకేదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతూ.. రైతు సమస్యలు, కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినందువల్లే తన భద్రతను తగ్గించారని ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరాలని తనకు లేదని.. తాను రాజకీయ వ్యక్తిని కాదన్నారు. 2008 నుంచి 2018 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్గా పనిచేసిన ఎన్ఎన్ వోరా వంటి వాళ్లకు భద్రత ఇప్పటికీ చెక్కుచెదరలేదన్నారు. తనకు ఎందుకు భద్రత కుదించారు? దీని వెనుక కారణాలేంటని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన రాలేదన్నారు.
తాను గవర్నర్గా ఉన్న సమయంలోనే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు చేశామని.. ఆర్టికల్ 370 రద్దు జరిగింది కూడా తన హయాంలోనేనన్నారు. సత్యపాల్ మాలిక్ జమ్మూకశ్మీర్తో పాటు మేఘాలయా, గోవా గవర్నర్గానూ సేవలందించారు. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కశ్మీర్, లద్ధాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సమయంలో సత్యపాల్ మాలిక్ గవర్నర్గా ఉన్నారు. ఆ చారిత్రక నిర్ణయం జరిగిన నెల రోజులకు ఆయన గోవా గవర్నర్గా బదిలీ అయ్యారు. అలాగే, అక్టోబర్ 2022 వరకు ఆయన మేఘాలయ గవర్నర్గా సేవలందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.