Imran Khan vs Gen Bajwa: ఇమ్రాన్-బజ్వా మధ్య ‘టీకప్పు’ తుపాను..!
ఒక ఫొటో కారణంగా పాక్ ప్రధాని - ఆర్మీచీఫ్ మధ్య విభేదాలు తలెత్తాయి. అఫ్గాన్ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు-హక్కానీలు తన్నుకొంటున్న సమయంలో ఓ ఫొటో సంచలనం సృష్టించింది. కాబుల్లోని సెరీనా హోటల్లో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ స్టైల్గా ఓ టీకప్పు
ఐఎస్ఐ చీఫ్ మార్పిడి చిచ్చు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఒక ఫొటో కారణంగా పాకిస్థాన్ ప్రధాని - ఆ దేశ ఆర్మీ చీఫ్ మధ్య విభేదాలు తలెత్తాయి. అఫ్గాన్ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు - హక్కానీలు తన్నుకొంటున్న సమయంలో ఓ ఫొటో కలకలం రేపింది. కాబుల్లోని సెరీనా హోటల్లో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ స్టైల్గా ఓ టీకప్పు పట్టుకొని దర్శనమిచ్చాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాక్ నేరుగా అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తనకు అవసరమైన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. మరో పక్క పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా కూడా దీనిపై అంసంతృప్తి వ్యక్తం చేశారు. తాలిబన్ల వెనుక ఐఎస్ఐ ఉందన్న విషయం బహిర్గతం కావడమే దీనికి ముఖ్య కారణం. తన అనుమతి లేకుండా ఐఎస్ఐ చీఫ్ దేశం దాటడంపై నోటీసులు జారీ చేసి పంచాయతీ పెట్టారు. చివరికు రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో విచారణ జరిపి ఫయాజ్ చేత క్షమాపణలు చెప్పించారు.
ఈ వివాదం అంతటితో ముగిసిందని అంతా భావించారు. కానీ, గత వారం ఫయాజ్ హమీద్ను హఠాత్తుగా పెషావర్ కోర్(12వ కోర్)కు బదిలీ చేస్తూ ఆర్మీ చీఫ్ కమర్ బజ్వా ఉత్తర్వులు జారీ చేశారు. హమీద్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్ను నియమించారు. ఇక్కడే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. దీంతో రోజులు గడుస్తున్నా.. కమర్ బజ్వా ఉత్తర్వులను అమలు చేస్తూ ప్రధాని కార్యాలయం నుంచి నోటిఫికేషన్ వెలువడలేదు. దీనికి తోడు హమీద్ను ఐఎస్ఐ చీఫ్గా కొనసాగించాలని ఇమ్రాన్ పట్టుబట్టారు. దీంతో ఆర్మీ చీఫ్కు ప్రధానికి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.
ఫయాజ్ హమీద్పై ఇమ్రాన్కు అంత ప్రేమ దేనికి..?
పాక్ సైన్యంలోని ఫయాజ్ హమీద్ బలోచ్ రెజ్మెంట్ నుంచి వచ్చారు. ఆయన త్రీస్టార్ జనరల్. ఆర్మీ చీఫ్ అయ్యే అర్హత ఉన్న జనరల్స్ వరుసలో నాలుగో స్థానంలో ఉన్నారు. 2019లో ఐఎస్ఐ చీఫ్గా ఆయన్ను నియమించారు. అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆసిమ్ మునీర్ను 8 నెలల్లోనే తొలగించారు. దీనికి ఓ కారణం ఉంది. ఫయాజ్ హమీద్ ఇమ్రాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. 2018 పాక్లో ఎన్నికలు జరిగిన సమయంలో ఫయాజ్ హమీద్ డిప్యూటీ ఐఎస్ఐ చీఫ్గా ఉన్నారు. ఆయన అంతర్గత భద్రతకు బాధ్యత వహిస్తారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులను నేరుగానే బెదిరించారు. వారిని ఇమ్రాన్ ఖాన్ ఏర్పాటు చేసిన పీటీఐ పార్టీలో చేరేలా ఒత్తిడి చేశారు. నవాజ్ షరీఫ్కు చెందిన పీఎంఎల్ఎన్ పార్టీ ఇచ్చిన టికెట్లను తీసుకోవద్దని అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు పీఎంఎల్ఎన్ ఓట్లలో చీలిక తెచ్చేందుకు పాకిస్థాన్లోని దక్షిణ పంజాబ్లో ఓపార్టీని పెట్టించారు. ఒక దశలో పాక్లోని ఎలక్షన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఆర్టీఎస్ను కూడా కుప్పకూల్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. హమీద్ ఎన్నికల అవకతవకలపై పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపణలు చేశారు.
ఫయాజ్ హమీద్ తీరుతో ఆగ్రహించి భార్యే అతనిపై కాల్పులు జరిపిన విషయాన్ని పాక్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఒకరు బహిర్గతం చేసినందుకు ఆ విలేకరి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.
పాకిస్థాన్లో చాలా సందర్భాల్లో సైన్యం కంటే ఐఎస్ఐ చాలా శక్తివంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఫయాజ్ హమీద్ను నియమించిన పెషావర్ కోర్ కూడా ప్రాధాన్యమున్న పోస్టే. అఫ్గాన్తో వ్యవహారాలను అదే చూసుకొంటుంది. కానీ,
నిఘా విభాగంలో తన మనిషి కొనసాగాలని ఇమ్రాన్ భావించారు. మంగళవారం ఆర్మీచీఫ్ జనరల్ కమర్ బజ్వాతో మాట్లాడారు. ఈ విషయాన్ని పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌధ్రీ కూడా ధ్రువీకరించారు.‘‘జనరల్ అహ్మద్ అంజుమ్ నియామక వివాదం పూర్తిగా తొలగిపోయింది. ఐఎస్ఐ చీఫ్ను నియమించే హక్కును ప్రధాని ఇమ్రాన్ వినియోగించుకున్నారు’’ అని డాన్ పత్రికకు తెలిపారు.
తన మనిషిని ఆర్మీ చీఫ్ చేసేందుకు ఇమ్రాన్ యత్నం..
డిసెంబర్ వరకు ఫయాజ్ను కొనసాగించాలని ఇమ్రాన్ కోరగా.. నవంబర్ 15 వరకు మాత్రమే కొనసాగించేందుకు బజ్వా అంగీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత కొత్త ఐఎస్ఐ చీఫ్ నియామకం తన అంగీకారంతోనే జరిగేలా ఇమ్రాన్ జాగ్రత్త తీసుకోనున్నారు. ఇక ఫయాజ్ హమీద్ సైన్యంలో కోర్ కమాండర్గా చేయడం ఇమ్రాన్కు కలిసొచ్చే అంశమే. ఎందుకంటే పాక్ ఆర్మీ చీఫ్ పదవి చేపట్టాలంటే కనీసం ఏడాది పాటు ఆ వ్యక్తి కోర్ కమాండర్గా బాధ్యతలను నిర్వహించి ఉండాలి. ప్రస్తుత ఆర్మీ చీఫ్ బజ్వా పదవీకాలం 2022 నవంబర్ 28వ తేదీతో ముగుస్తుంది. అప్పటికి ఫయాద్కు కోర్ కమాండర్గా ఏడాది కాలం పూర్తవుతుంది. అదే సమయంలో బజ్వా వారసుడిని ఇమ్రాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ముగ్గురు సీనియర్ జనరల్స్ కాదని ఫయాద్ను ఎంచుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే 2023 అక్టోబర్లో పాక్లో ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధానులను ముప్పతిప్పలు పెట్టిన ఆర్మీ చీఫ్లు..
పాక్ ప్రధానులు ఇలా సీనియర్లను వెనక్కి నెట్టి తమకు నచ్చిన ఆర్మీ చీఫ్లను నియమించడం కొత్తేమీ కాదు. గతంలో జుల్ఫీకర్ అలీ భుట్టో ఏడుగురు సీనియర్ జనరల్స్ను కాదని జియా ఉల్ హక్ను ఆర్మీ చీఫ్గా నియమించారు. జియా పదవి చేపట్టాక సైనిక తిరుగుబాటు చేశాడు. అనంతరం భుట్టోను ఉరి తీయించారు. నవాజ్ షరీఫ్ ఏరి కోరి ఐదుగురు ఆర్మీ చీఫ్లను నియమించారు. వీరిలో కొందరు ఆయనకే తలనొప్పిగా మారారు.
* ఆసీఫ్ నవాజ్ పదవీకాలంలోనే మరణించారు.
* అబ్దుల్ వాహీద్ కాకర్ చీఫ్ అయ్యాక నవాజ్ షరీఫ్ చేత రాజీనామా చేయించారు.
* జహంగీ కరామత్ మాత్రం నవాజ్తో విభేదాలు తలెత్తగానే హుందాగా పదవి నుంచి తప్పుకొన్నారు.
* పర్వేజ్ ముషారఫ్ ఏకంగా సైనిక తిరుగుబాటు చేసి దేశాన్నే ఆధీనంలోకి తీసుకొన్నారు.
* రాహిల్ షరీఫ్కు నవాజ్తో విభేదాలు ఉన్నా.. ఎటువంటి ఉద్రిక్తతలు సృష్టించలేదు.
* కమర్ జావెద్ బజ్వా మాత్రం చేతికి మట్టి అంటకుండా దేశంలో సర్వాధికారాలను అనుభవిస్తున్నాడు. నవాజ్ను ఏకంగా జైలుకే పంపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!