Imran Khan: మాకూ భారత్లానే కావాలి..!
అంతర్జాతీయ సంబంధాల్లో ఒక దేశంతో మరో దేశం పోల్చుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ సంబంధాలు మొత్తం అవసరాలపైన, జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయి.
పాక్ ప్రధాని ఇమ్రాన్ విచిత్ర వైఖరి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అంతర్జాతీయ సంబంధాల్లో ఒక దేశంతో మరో దేశం పోల్చుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ సంబంధాలు మొత్తం.. అవసరాలపైన, జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయి. ఈ విషయం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరిచిపోయినట్లున్నారు. ఆయన ఈ మధ్య ప్రతిదీ భారత్తో పోల్చుకొని చూసుకొంటున్నారు. దీంతో కొన్ని సార్లు ఆయనకు షాకులు కూడా తగిలాయి. అయినా తీరులో మార్పు రాలేదు. తాజాగా ఆయన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా నుంచి పాకిస్థాన్ గౌరవప్రదమైన, ఉన్నతమైన సంబంధాలు కోరుకుంటోందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆ సంబంధాలు అమెరికా-యూకే మధ్య లేదా.. అమెరికా-భారత్ మధ్యలో ఉన్నట్లు ఉండాలన్నారు. అమెరికాకు ఉగ్రవాదంపై పోరులో పాక్ వీలైనంత అండగా నిలిచిందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. దీనికి 70వేల ప్రాణాలు, 150 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తుల రూపంలో భారీ మూల్యం చెల్లించామన్నారు. కానీ అమెరికా మాత్రం తాము సరైన అండదండలు ఇవ్వలేదనే భావనలో ఉందని వివరించారు. అఫ్గానిస్థాన్ శాంతి చర్చల కోసం తాము చేయగలిగినంత చేశామన్నారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడకపోవడంపై కొంత నిరాశ వ్యక్తం చేశారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత ప్రధాని నరేంద్రమోదీని ఈ విషయమై సంప్రదించినా ఫలితం లేకపోయిందన్నారు. జమ్ము-కశ్మీర్ విషయంలో భారత్ తీసుకొన్న నిర్ణయం బెడిసికొడుతుందన్నారు. అంతేకాదు.. చైనా విషయంలో భారత్ తీరు ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఇరుదేశాల మధ్య వ్యాపారం భారత్-చైనాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
అదే సమయంలో భారత్ గొప్ప భాగస్వామి అని శ్వేతసౌధం ప్రకటన విడుదల చేయడం విశేషం. శ్వేతసౌధ ప్రెస్ సెక్రటరీ జెన్సాకీ ఈ విషయాన్ని తెలిపారు. ఇక ఓ పక్క శ్వేతసౌధంలో అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనితో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ అయిన సమయంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. తాలిబాన్లను పాక్ ఎగదోస్తోందని అఫ్గాన్ నేతలు కొన్నాళ్ల నుంచి ఆరోపిస్తున్నారు.
ఇలా కోరినందుకే యూకే పర్యటన రద్దు..!
వచ్చే నెలలో జరగాల్సిన యూకే పర్యటనను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రద్దు చేసుకొన్నారు. ఈ పర్యటనలో ఆయన ఓ క్రికెట్ మ్యాచ్కు హాజరుకావడంతో పాటు.. ప్రధాని బోరిస్ జాన్సన్తో భేటీ కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఓ డిమాండ్ విషయంలో యూకే నుంచి మొండి చెయ్యి ఎదురుకావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. ఇటీవల భారత్-యూకే మధ్య వచ్చే పదేళ్ల సంబంధాలపై ఓ రోడ్మ్యాప్కు అంగీకారం తెలుపుతూ సంతకాలు జరిగాయి. రక్షణ, శాస్త్రసాంకేతిక రంగాల్లో సహకారంతో పాటు భారతీయులు యూకేకు వెళ్లడాన్ని మరింత సులువు చేయనున్నారు. పాకిస్థాన్ కూడా ఇలాంటి రోడ్మ్యాప్ ఒప్పందాన్ని చేసుకోవాలనుకుంటోందని యూకేకు వెల్లడించారు. కానీ, యూకే దీనిని తేలిగ్గా తీసుకొంది. కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ ఆడటానికి మాత్రమే వెళ్లాల్సి రావడాన్ని ఇమ్రాన్ అవమానంగా భావించారు. దీంతో చేసేది లేక ఆ పర్యటనను రద్దు చేసుకొన్నారు.
ఇమ్రాన్కు అది కూడా తెలియదా..?
ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఓ ట్వీట్ చేసి నవ్వుల పాలయ్యారు. ఆయన బుధవారం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కో ఛైర్మన్ బిల్గేట్స్కు ఫోన్ చేశారు. పాక్లో పోలియో నిర్మూలన వ్యాక్సినేషన్ చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. పనిలోపనిగా పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ ఇంక్యూబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. వాస్తవానికి బిల్ గేట్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బోర్డులో లేరు. గతేడాది ఆయనపై ఆరోపణలు వచ్చిన సమయంలో బోర్డు నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు కేవలం షేర్ హోల్డర్ మాత్రమే. ఇక ఆయన ఛైర్మన్ పదవి దిగిపోయి కూడా చాలా ఏళ్లవుతుంది. మరి ఆయన ఏ అధికారంతో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని పాకిస్థాన్లో ఏర్పాటు చేస్తారో ఇమ్రాన్ఖాన్కే తెలియాలి. మైక్రోసాఫ్ట్ నిర్ణయాలు బోర్డు, సీఈవో, ఛైర్మన్లు తీసుకొంటారన్న విషయాన్ని ఇమ్రాన్ ఎందుకు విస్మరించారో తెలియదు. ఆయన చేసిన ట్వీట్ను పాకిస్థానీయులే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అమెరికా బయట మైక్రోసాఫ్ట్ అతిపెద్ద ఆఫీస్ భారత్లోని హైదరాబాద్లో ఉన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!