ఇమ్రాన్ ఆట ముగియనుందా..!
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఓ వైపు రాజకీయ సవాళ్లు మరోవైపు ఆర్థిక సమస్యలు, ఇంకా పేదరికం, నిరుద్యోగం ఉండనే ఉన్నాయి. వీటి నుంచి బయటపడేందుకు ఇమ్రాన్ ఎత్తుకున్న
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే ఓ వైపు రాజకీయ సవాళ్లు మరోవైపు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు ఇమ్రాన్ ఎత్తుకున్న ‘నయా పాకిస్థాన్’ నినాదం వింటుంటే ఆ దేశ ప్రజలకు చిర్రెత్తుకొస్తోందట. సైన్యం కూడా అవసరమా మాకు ఈ భుజం మోత అని భావిస్తోందట. ఇక ప్రపంచదేశాల నుంచి తీసుకువచ్చిన అప్పుల కుప్ప పేరుకుపోతుండగా.. పాకిస్థాన్లో ఇమ్రాన్ ఆట ఆఖరి అంకానికి చేరిందన్న విశ్లేషణలు బయలుదేరాయి.
ప్రజల్లో తగ్గుతున్న విశ్వాసం!
ఇమ్రాన్ఖాన్ క్రికెట్ ద్వారా పాకిస్థాన్కు అంతర్జాతీయ గౌరవాన్ని తెచ్చిపెట్టిన గొప్ప ఆటగాడు. రాజకీయాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తానంటూ వచ్చిన ఇమ్రాన్ను మొత్తానికి దేశాధినేతను కూడా చేశారు. ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి పాకిస్థాన్ అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక సవాళ్లతో కొట్టుమిట్టాడుతోంది. ఆల్రౌండర్ను కదా.. అన్నీ తనే ఆడేయొచ్చు అనుకున్న ఇమ్రాన్కు ఇప్పుడు అధికారం నిలుపుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. ‘నయా పాకిస్థాన్’ ఇమ్రాన్ నినాదం.. అన్నట్లే గతంలో కంటే మరింత కొత్త ఎత్తులకు ద్రవ్యోల్బణం చేరుతోంది. దేశాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. పేదరికం వెక్కిరిస్తోంది. నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. ఈ తరుణంలో ప్రజల్లోనూ ఇమ్రాన్ పాలనపై విశ్వాసం సన్నగిల్లుతోంది. అందుకే ఆయన క్యాబినెట్లో ఆర్థిక మంత్రి కూడా జనరల్ సెనేట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. గతేడాది పాకిస్థాన్లో రాజకీయ పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చి ఇమ్రాన్ సర్కార్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నాయి. ఆ కూటమి అభ్యర్థి మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీనే.. మొన్నటి ఎన్నికల్లో ఇమ్రాన్ ప్రభుత్వంలో మంత్రిని ఓడించారు. ఆ ఓటమి తర్వాత ఇమ్రాన్ సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కొంది.
దూకుడుగా విపక్ష కూటమి
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ సర్కారు నెగ్గింది కానీ.. సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ ఓటింగ్ రోజున నవాజ్ షరీఫ్ పార్టీకి చెందిన ఎంపీలపై తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ప్రతినిధులు చేయి చేసుకోవడం అధికార పార్టీలో గూడు కట్టుకున్న అసహనాన్ని ఎత్తిచూపింది. అధికారంలో ఉంటే ఏదైనా సాధ్యమని భావిస్తున్న ఇమ్రాన్ పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఇన్నాళ్లూ ఇమ్రాన్ సర్కార్కి వ్యతిరేకంగా ఉన్న వారిపై ఉక్కుపాదం మోపుతూ వచ్చిన సైన్యం ఎప్పుడు పక్కకు తప్పుకుంటుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ మీడియాని గుప్పిట పట్టి ఇమ్రాన్ రోజులు నెట్టుకొస్తుండగా.. ఆయన ప్రభుత్వ అరాచకాలను వెలుగులోకి తేవడంలో అంతర్జాతీయ మీడియాని, సోషల్ మీడియాని విపక్ష కూటమి సమర్థంగా వినియోగించుకుంది. ప్రజల్లో తిరుగుబాటు తీసుకురాగలిగింది. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్ ప్రభుత్వం నుంచి వైదొలగాలని కొందరు చూస్తుండగా.. ఆయన మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ఎన్, జర్దారీ పార్టీకి మధ్య ఒప్పందం కుదిరిన రోజు ఇమ్రాన్ సర్కార్ కూలడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది కూడా ఇంకా ఎంతో దూరంలో లేదని ఇమ్రాన్ ఆట కట్టనుందని చెబుతున్నారు.
పేరుకు పోతున్న అప్పులు
దేశంలోకి పెట్టుబడులు ఎలాగూ రావు. సంపద సృష్టి అన్నది లేనే లేదు. ఈ పరిస్థితుల్లో అప్పులనే నమ్ముకున్న ఇమ్రాన్.. ప్రస్తుత పాకిస్థాన్ ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల్లోనే విదేశాల నుంచి 670 బిలియన్ డాలర్లు అప్పులు చేశారు. ఇందులో చైనా నుంచి గతనెలలో తెచ్చుకున్న వాణిజ్య అప్పు 500 మిలియన్ డాలర్లు కూడా ఉంది. ఈ 7నెలల వ్యవధిలోనే పాకిస్థాన్ అప్పులు 300 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. ఇంతలా అప్పులు పేరుకు పోవడం సహా నిరుద్యోగం, పేదరికం, తాండవిస్తుండడంతో పాకిస్థానీలు ఇమ్రాన్ పట్ల విశ్వాసాన్ని కోల్పోయారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోసారి తమ జీవితంలో పాకిస్థానీలు ఇమ్రాన్ను నమ్మే అవకాశం లేదని.. ఆయన శకానికి తెరపడుతుందని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)