Child Marriages: అరెస్టులకు సిద్ధం.. 4000 మందిపై కొనసాగుతున్న విచారణ
బాల్య వివాహాలు చేసుకున్న వారిని రేపటి నుంచి అరెస్టు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. దాదాపు 4000 మందిపై విచారణ జరుగుతోందని చెప్పారు.
గువాహటి: బాల్య వివాహాలపై అస్సాం (Assam) ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ.. 14 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswasharma) శుక్రవారం నుంచే అరెస్టులు మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 4000 మందిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ‘‘ బాల్య వివాహాలకు పాల్పడిన వేలాది మందిని రేపటి నుంచి అరెస్టు చేస్తున్నాం. ఆరేడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మైనర్ బాలికలను గతంలో పెళ్లి చేసుకున్నా, వివాహం చేసుకోవాలని నిర్ణయించినా కచ్చితంగా అరెస్టు చేస్తాం’’ అని హిమంత బిశ్వశర్మ మీడియాకు తెలిపారు.
బాల్యవివాహాలు, మాతాశిశు మరణాల రేటును తగ్గించాలని ఇటీవల అస్సాం కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. అరెస్టులపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సీఎం.. తాజాగా కార్యాచరణ మొదలుపెట్టారు. దీనిని రాజకీయం చేయొద్దని, కేవలం బాల్యవివాహాలపై జరుగుతున్న యుద్ధంగానే భావించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు జరిపించిన మతపెద్దలు, పురోహితులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దూబ్రీ జిల్లాలో అత్యధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 31 శాతం వివాహాలు తక్కువ వయసులోనే జరగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..