Black Fungus చికిత్సను ఆయుష్మాన్ భారత్లో చేర్చండి
కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. దీనిపై వెంటనే దృష్టి సారించి రోగులకు అత్యవసర చికిత్స అందజేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది.....
ప్రధానికి లేఖ రాసిన సోనియా గాంధీ
దిల్లీ: కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. దీనిపై వెంటనే దృష్టి సారించి రోగులకు అత్యవసర చికిత్స అందజేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ‘ఆంఫోటెరిసిన్-బి’ ఔషధానికి కొరత ఏర్పడింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వెంటనే ఈ ఔషధం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని మోదీని కోరారు. అలా బ్లాక్ ఫంగస్గా పేర్కొంటున్న మ్యూకోర్ మైకోసిస్ చికిత్సను ఉచిత వైద్య పథకం ఆయుష్మాన్ భారత్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
మరోవైపు దేశీయగా ‘ఆంఫోటెరిసిన్-బి’ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కేంద్రం తెలిపింది. అవసరమైతే ప్రపంచ దేశాల తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని దేశీయంగా అందుబాటులో ఉంచేందుకు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్