Corona: 197 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు కొత్త కేసులు 20వేల పైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14.29లక్షల మందికి వైరస్‌

Updated : 02 Oct 2021 11:03 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు కొత్త కేసులు 20వేల పైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14.29లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 24,354 మందికి పాజిటివ్‌గా తేలింది. అయితే క్రితం రోజు కేసుల(26,727)తో పోలిస్తే 8.8శాతం తక్కువ కేసులు నమోదవడం కాస్త సానుకూలాంశం. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.38కోట్లు దాటింది. ఇక కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళలోనే నమోదవుతున్నాయి. నిన్న అక్కడ 13,834 కరోనా కేసులు బయటపడగా.. 95 మంది మృత్యువాతపడ్డారు.

మరోసారి కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 25,455 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3.30కోట్ల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 97.86శాతానికి చేరింది. కరోనా కారణంగా నిన్న 234 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 4,48,573 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది.

మరోవైపు కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్‌ కేసులు 197 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,73,889 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.81శాతానికి దిగొచ్చింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. నిన్న 69.33లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 89.74కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాలు వెల్లడించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని