LAC: 20 మందికిపైగా భారత సైనికులకు గాయాలంటూ నివేదికలు..!
భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో క్షతగాత్రుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఆంగ్లపత్రికల్లో కథనాలు వస్తున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: డిసెంబర్ 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్(arunachal pradesh)లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంట ఘర్షణ చోటు చేసుకుని ఇరుపక్షాల సైనికులు గాయపడ్డారు. భారత(India) సైన్యం ఈ అంశంపై ప్రకటన విడుదల చేసినా.. క్షతగాత్రుల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. తొలుత ఆరుగురు సైనికులు గాయపడ్డారంటూ నివేదికలు వెలువడగా.. తాజాగా ఆ సంఖ్య 20కి పైగా ఉంటుందని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. క్షతగాత్రుల సంఖ్య భారత్ కంటే చైనా (china)వైపు అధికంగా ఉన్నట్లు సమాచారం. ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్(India)కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం. పీఎల్ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకొంది. అరుణాచల్ ప్రదేశ్(arunachal pradesh) వద్ద సరిహద్దుల్లో ఘర్షణలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2021 అక్టోబర్లో కూడా పెట్రోలింగ్ విషయంలో భారత్(India)-చైనా(china) సేనలు ఘర్షణ పడ్డాయి. మరోవైపు భారత వాయుసేన అరుణాచల్ ప్రదేశ్ వద్ద యాక్టివ్ కాంబాట్ పెట్రోల్స్ను (యుద్ధవిమానాలతో గస్తీ) మొదలుపెట్టింది. చైనా వాయుసేన కదలికలను గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వాయుసేన వర్గాలు పేర్కొన్నాయి.
యుద్ధ్ అభ్యాస్ ముగిసిన వారంలోపే..!
భారత్-అమెరికా సేనలు ఈ ఏడాది సంయుక్త సైనిక శిక్షణ కార్యక్రమం ‘యుద్ధ్ అభ్యాస్-2022’ను నవంబర్ 17 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు నిర్వహించాయి. చైనా (china) సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ పర్వత శిఖరాలపై ఔలీలో వీటిని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సైనికులకు అమెరికా అదే సమయంలో ప్రమోషన్లు కూడా ఇచ్చింది. డిసెంబర్ 2వ తేదీన ఈ కార్యక్రమం ముగిసింది. ‘యుద్ధ్ అభ్యాస్-2022’ను ఉత్తరాఖండ్లో నిర్వహిస్తున్నామని భారత్ ప్రకటించిన తర్వాత చైనా(china) పలు మార్లు తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చైనా(china) విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ నవంబర్ 30న మాట్లాడుతూ.. సరిహద్దు ఒప్పందాలను భారత్(India) ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ‘‘వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు సమీపంలో నిర్వహిస్తున్న విన్యాసాలు.. 1993, 1996లో భారత్-చైనాల మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే’’ అని పేర్కొన్నారు. భారత్ (India) ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. ‘‘ఎవరితో కలిసి యుద్ధవిన్యాసాలు చేయాలో భారత్(India)కు మూడో దేశం చెప్పాల్సిన అవసరం లేదు. ద్వైపాక్షిక ఒప్పందాలతో ఈ విన్యాసాలకు సంబంధం లేదు’’ అని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ పేర్కొన్నారు. మరోవైపు భారత్-చైనా వ్యవహారాల్లో తల దూర్చొద్దని అమెరికాను కూడా డ్రాగన్ హెచ్చరించింది.
భారీ సంఖ్యలో పీఎల్ఏ దళాలు పెట్రోలింగ్కు
ఇటీవల కాలంలో చైనా(china) సైన్యం భారీ సంఖ్యలో దళాలను పెట్రోలింగ్కు పంపుతోంది. పెట్రోలింగ్ చేసే ప్రదేశాలు చైనావే అని వెల్లడించేందుకు ఇలా చేస్తోంది. గత కొన్నేళ్లలో చైనా (china)చొరబాట్లు ఎల్ఏసీ పశ్చిమ సెక్టార్లోనే ఎక్కువగా చోటు చేసుకొన్నాయి. కానీ, మధ్య, తూర్పు సెక్టార్లలో కూడా ఇటీవల కాలంలో మెల్లగా పెంచుతోంది. వాస్తవాధీన రేఖ పశ్చిమ (లద్దాఖ్), మధ్య (హిమాచల్, ఉత్తరాఖండ్) సిక్కిం, తూర్పు (అరుణాచల్ప్రదేశ్) సెక్టార్లుగా విభజితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్