న్యూజిలాండ్ యూట్యూబర్పై భారత్ నిషేధం
ప్రముఖ యూట్యూబర్, న్యూజిలాండ్కు చెందిన కార్ల్ ఎడ్వర్డ్ రైస్ అలియాస్ కార్ల్ రాక్పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ వచ్చే ఏడాది వరకు
దిల్లీ: ప్రముఖ యూట్యూబర్, న్యూజిలాండ్కు చెందిన కార్ల్ ఎడ్వర్డ్ రైస్ అలియాస్ కార్ల్ రాక్పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ వచ్చే ఏడాది వరకు అతడు భారత్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. పర్యాటక వీసాపై భారత్కు వచ్చిన అతడు ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని, అందుకే అతడి పేరును బ్లాక్లిస్ట్లో చేర్చినట్లు తెలిపింది. అయితే గతేడాది అక్టోబరులోనే అతడి వీసాను రద్దు చేయగా.. కార్ల్ రాక్ తాజాగా సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
న్యూజిలాండ్కు చెందిన కార్ల్ రాక్ ట్రావెల్ సేఫ్టీ, పర్యాటక ప్రదేశాలపై వీడియోలు చేస్తుంటాడు. అతడి యూట్యూబ్ ఛానల్కు 1.8 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. గత పదేళ్లుగా భారత్లోనే ఉంటున్న అతడు.. 2019లో దిల్లీకి చెందిన మనీశా మాలిక్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల తన వీసాను భారత ప్రభుత్వం రద్దు చేసిందని, తిరిగి దేశానికి రాకుండా తన పేరును బ్లాక్ లిస్ట్లో చేర్చిందని రాక్ నిన్న తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
‘‘2020 అక్టోబరులో దుబాయి, పాకిస్థాన్ వెళ్లేందుకు నేను భారత్ నుంచి బయల్దేరాను. ఆ సమయంలో ఎయిర్పోర్టు వద్ద నా వీసాను అధికారులు రద్దు చేశారు. ఎందుకు చేశారో నాకు చెప్పలేదు. దీంతో దుబాయి వెళ్లాక నేను కొత్త వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాను. అయితే నా పేరు బ్లాక్ లిస్టులో చేర్చారని, అందుకే కొత్త వీసా ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారు. బ్లాక్లిస్ట్లో చేర్చేందుకు నాకు ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. దీంతో గత కొన్ని నెలలుగా నేను భార్యకు దూరంగా ఉండాల్సి వస్తోంది’’ అని రాక్ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ వీడియోపై కేంద్ర హోంశాఖ అధికారులు స్పందించారు. ‘‘కార్ల్ రాక్ టూరిస్టు వీసాపై వచ్చి భారత్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అందుకే ఆయన వీసాను రద్దు చేశాం. వచ్చే ఏడాది వరకు ఆయనకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించాం’’ అని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?