India-China: ఆ రోడ్డు కోసమే చైనా నాటకాలు..
భారత్-చైనా సరిహద్దు వివాదంపై చర్చలకు ముందు నుంచే ప్రతికూల సంకేతాలు పంపడం మొదలుపెట్టింది. ఎటవంటి ఫలితం వెలువడకూడదనే లక్ష్యంతోనే చైనా చర్చలకు వచ్చినట్లుంది. చర్చలకు ముందు అరుణాచల్
చర్చలు విఫలమైన నేపథ్యంలో గ్లోబల్ టైమ్స్ తాటాకు చప్పుళ్లు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత్-చైనా సరిహద్దు వివాదంపై చర్చలకు ముందు నుంచే డ్రాగన్ ప్రతికూల సంకేతాలు పంపడం మొదలుపెట్టింది. ఎటవంటి ఫలితం వెలువడకూడదనే లక్ష్యంతోనే చైనా చర్చలకు వచ్చినట్లుంది. చర్చలకు ముందు అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్దకు 200 మంది సైనికులను పంపింది. భారత్ సైన్యం వీరిని అడ్డుకొంది. ఆగస్టులో బారాహోతి వద్దకు 100 మంది జవాన్లను పంపగా.. వీరు భారత భూభాగంలో వంతెనను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. చర్చలకు ముందు ఇలాంటి చర్యలతో భారత్పై ఒత్తిడి పెంచాలని చూసింది.
ఈ ప్రాంతం ప్రాముఖ్యత ఏమిటీ..?
హాట్ స్ప్రింగ్స్, గోగ్రాపోస్టులు అంత్యంత కీలకమైనవి. గోగ్రా పోస్టుపై గత చర్చల్లో ఒప్పందం కుదిరింది. చాంగ్ చెన్మో నదికి రెండు వైపులా ఉన్న ఈ ప్రాంతాలు చాలా కీలకం. తూర్పు వైపు గోగ్రా పోస్టు, ఉత్తరం వైపు హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఆగ్నేయం వైపు నంచి వస్తున్న ఈ నది గోగ్రాపోస్టు వద్ద నైరుతి వైపు మలుపు తిరుగుతుంది. ఈ ప్రాంతం కారాకోరం పర్వతాలకు ఉత్తరం వైపు ఉంది. ఇది ఖాంగ్కా పాస్ సమీపంలో ఉంటుంది. ఈ పాస్ చైనాలోని షింజియాంగ్- భారత్లోని లద్దాఖ్ ప్రాంతాన్ని వేరుచేస్తుంటుంది. ఈ పాస్కు సమీపంలోని దౌలత్బేగ్ ఓల్డీ వద్ద భారత వైమానిక స్థావరం ఉంది. ఈ పాస్ను భారత్-చైనా మధ్య సరిహద్దుగా డ్రాగన్ భావిస్తుంది. కష్గర్-లాసా వెళ్లే కీలకమైన 219 హైవే భారత్కు అత్యంత సమీపంగా వెళుతుంది. యుద్ధ సమయంలో భారత్ దీనిపై దాడి చేస్తుందనే భయాలు చైనాలో ఉన్నాయి. దీంతో ఈ హైవేపై దాడి చేయడానికి అవకాశం ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ, చుషూల్, దెమ్చొక్లపై భారత్ పట్టు తప్పించాలని డ్రాగన్ చూస్తోంది. అందుకే హాట్ స్ప్రింగ్స్ నుంచి చైనా వెనక్కి తగ్గేందుకు ఆసక్తి చూపడంలేదు. దీనికి భారత్ను కారణంగా చూపే యత్నం చేస్తోంది.
తప్పు భారత్ నెత్తిన రుద్దే యత్నం
ఇటీవల 8గంటల పాటు జరిగిన భారత్-చైనా కోర్కమాండర్ స్థాయి సమావేశం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా ముగిసింది. చర్చలు పురోగతి సాధించకూడదన్న లక్ష్యంతోనే చైనా అధికారులు వచ్చినట్లు అనిపిస్తోంది. ఒక దశలో చైనా వెస్ట్రర్న్ థియేటర్ కమాండర్ ప్రతినిధి సీనియర్ కర్నల్ లాంగ్ షావ్హో మాట్లాడుతూ ‘‘పరిస్థితిని తప్పుదోవపట్టించడం భారత్ మానుకోవాలి. సరిహద్దుల్లో భారత్ కోరుకొన్నది అంత తేలిగ్గా జరగదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అంటూ బెదిరింపులకు యత్నించాడు. దీంతో హాట్ స్ప్రింగ్స్, ఇతర పెట్రోలింగ్ పాయింట్ల వద్ద ఉద్రిక్తతలు అంత తేలిగ్గా తగ్గవని తేలిపోయింది.
గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్..
ఒక రోజు తర్వాత ఇలాంటి రాగాన్నే చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్టైమ్స్’ కూడా అందుకొంది. ‘‘భారత్ ఓ విషయం గుర్తుంచుకోవాలి. భారత్ అనుకున్న ఫలితాలు సరిహద్దుల వద్ద లభించవు. ఒక వేళ ఆ దేశం యుద్ధం ప్రారంభిస్తే.. ఓటమి ఖాయం. ఎటువంటి రాజకీయ మార్పులు, ఒత్తిళ్లను చైనా ఏమాత్రం పట్టించుకోదు. భారత్లో సరిహద్దు వివాదాన్ని డీల్ చేసే విషయంలో చైనా రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. చైనాకు చెందిన భూమి ఎప్పటికీ చైనాదే. అది ఎప్పటికీ మారదు. భారత్ ఇంకా నిద్రలో నడుస్తున్నట్లే వ్యవహరిస్తోంది. అది స్పృహలోకి వస్తుందేమో ఎదురు చూడాలి. భారత్, చైనాలు రెండూ శక్తిమంతమైన దేశాలే. ఈ విషయం చైనాకు తెలుసు. కానీ, భారత్ ఏదో చేద్దామని భావిస్తోంది. పరిస్థితిని తప్పుదోవ పట్టిస్తూ చైనాను భారత్ తక్కువగా అంచనా వేస్తోంది. చివరికి ఆ అంచనాలతో నష్టపోవాల్సి వస్తుంది. చైనా-అమెరికా మధ్య విభేదాలను వ్యూహాత్మక భేరాలకు భారత్ ఓ అవకాశంగా భావిస్తోంది. అమెరికా కూటమిలోకి భారత్ వెళ్లకుండా చేసేందుకు సరిహద్దు విషయంలో చైనా కొంత మెత్తబడుతుందని భావిస్తున్నట్లుంది. ఏది ఏమైనా భారత్-చైనా మధ్య సమస్య మిగిలి ఉంది. దీనికి మూలకారణాల్లో మార్పు రాలేదు. చర్చల విషయంలో భారత్ వైపు సరైన వ్యవహార శైలి లేదు. వారి డిమాండ్లు వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేవు’’ అంటూ బెదిరింపు ఎడిటోరియల్ను ప్రచురించింది.
భారత్లో తైవాన్కు మద్దతుపై డ్రాగన్కు మంట..
లద్దాఖ్లో ఇరు దేశాల కోర్ కమాండర్ల చర్చల తేదీ, తైవాన్ జాతీయ దినోత్సవం ఒకే రోజు వచ్చాయి. దీంతో దిల్లీలో తైవాన్కు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. తైవాన్కు సంబంధించిన ఏ అంశాన్నైనా చైనా చాలా తీవ్రంగా తీసుకొంటుంది. ప్రైవేటు వ్యక్తులు అతికించిన పోస్టర్లు, బ్యానర్లపై కూడా భారత్లోని చైనా రాయబారి బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. భారత్లోని వ్యక్తులు, మీడియా తైవాన్ స్వాతంత్ర్య అంశానికి వేదికలుగా మారుతున్నాయని మండిపడ్డారు.
మలబార్ యద్ధవిన్యాసాల ముందు..
భారత్ మలబార్ యుద్ధవిన్యాసాల్లో పాల్గొనడం ఎప్పటి నుంచో చైనాకు ఏమాత్రం ఇష్టంలేదు. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ను కట్టడి చేయడానికే ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారని భావిస్తోంది. బంగాళాఖాతంలో నిర్వహిస్తోన్న ఈ విన్యాసాల్లో క్వాడ్ సభ్య దేశాలు మొత్తం పాల్గొనడం చైనాకు కంటగింపుగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!