Corona :20వేలకు దిగువన కేసులు.. 200 లోపు మరణాలు
201 రోజుల అనంతరం కొత్త కేసులు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ఇక మరణాలు కూడా 200లోపే ఉన్నాయి.
దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. తాజాగా కొత్త కేసులు 20వేల లోపే నమోదుకావడం ఊరట కలిగిస్తోంది. 201 రోజుల అనంతరం కొత్త కేసులు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ఇక మరణాలు కూడా 200లోపే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
• గడిచిన 24 గంటల్లో 13,21,780 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,795 కేసులు వెలుగులోకి వచ్చాయి.
• నిన్న 179 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,47,373గా ఉంది.
• కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. తాజాగా 26,030 మంది కొవిడ్ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 32,9,58,002(97.81%)కి చేరింది.
• ప్రస్తుతం క్రియాశీల కేసులు 292206(0.87%) ఉన్నాయి.
• ఇక దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 1,02,22,525 మందికి టీకాలు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన డోసుల సంఖ్య 87 కోట్లు దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్