India Corona : కొత్తగా 2.34 లక్షల కేసులు.. 3.52 లక్షల రికవరీలు
దేశంలో కరోనా ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కేసులు 2 లక్షలకుపైనే నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు భారీగానే ఉండటం ఆందోళన
స్వల్పంగా పెరిగిన పాజిటివిటీ రేటు..
దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కేసులు 2 లక్షలకుపైనే నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు భారీగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
¬ గడిచిన 24 గంటల్లో 16,15,993 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,34,281 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రంలో నమోదైన కేసులే 50,812గా ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న ఆ రాష్ట్రంలో 27,971 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39% నుంచి 14.50%కి పెరిగింది.
¬ నిన్న ఒక్క రోజే 893 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,94,091కి చేరింది.
¬ గడిచిన 24 గంటల్లో 3,52,784 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్ను జయించిన వారి సంఖ్య 3.87 కోట్లకు చేరింది. దీంతో రికవరీ రేటు 94.21% శాతానికి చేరింది.
¬ ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 18,84,937కి చేరి.. ఆ రేటు 4.59 శాతంగా కొనసాగుతోంది.
¬ మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. నిన్న 62,22,682 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 165 కోట్లు దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.