India Corona : కొత్తగా 2.34 లక్షల కేసులు.. 3.52 లక్షల రికవరీలు

దేశంలో కరోనా ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కేసులు 2 లక్షలకుపైనే నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు భారీగానే ఉండటం ఆందోళన

Updated : 30 Jan 2022 10:25 IST

స్వల్పంగా పెరిగిన పాజిటివిటీ రేటు..

దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కేసులు 2 లక్షలకుపైనే నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు భారీగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

¬ గడిచిన 24 గంటల్లో 16,15,993 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,34,281 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రంలో నమోదైన కేసులే 50,812గా ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న ఆ రాష్ట్రంలో 27,971 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39% నుంచి 14.50%కి పెరిగింది. 

¬ నిన్న ఒక్క రోజే 893 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,94,091కి చేరింది.

¬ గడిచిన 24 గంటల్లో 3,52,784 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.87 కోట్లకు చేరింది. దీంతో రికవరీ రేటు 94.21% శాతానికి చేరింది.

¬ ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 18,84,937కి చేరి.. ఆ రేటు 4.59 శాతంగా కొనసాగుతోంది.

¬ మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న 62,22,682 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 165 కోట్లు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని