India Corona : 10 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు.. 1 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు..

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.

Published : 27 Feb 2022 09:57 IST

దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 10 వేలకు దిగిరావడం  ఊరట కలిగిస్తోంది. మరోవైపు మరణాలు కూడా 250లోపే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

  1. గడిచిన 24 గంటల్లో 10,22,204 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,273 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
  2. కొత్త కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతానికి దిగివచ్చింది.
  3. ఇక నిన్న 243 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,13,724కు చేరింది.
  4. గత కొన్ని రోజులుగా కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతుండటం సానుకూలాంశం. నిన్న 20,439 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 4.22 కోట్లు దాటింది. ఆ రేటు 98.54%కి చేరింది.
  5. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,11,472కు తగ్గి.. ఆ రేటు 0.26 శాతానికి క్షీణించింది.
  6. ఇక నిన్న 24,05,049 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసులు సంఖ్య 177 కోట్లు దాటింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు