India Corona : 1700కు దిగొచ్చిన కొత్త కేసులు..

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 3 వేల దిగువనే నమోదువుతున్న కొత్త కేసులు.. తాజాగా 1700కు దిగిరావడం మరింత ఊరట కలిగిస్తోంది.

Updated : 20 Mar 2022 12:22 IST

దేశంలో క్రియాశీల కేసులు 26 వేలు మాత్రమే..

దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 3 వేల దిగువనే నమోదువుతున్న కొత్త కేసులు.. తాజాగా 1700కు దిగిరావడం మరింత ఊరట కలిగిస్తోంది. అయితే మరణాల్లో మాత్రం హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో 4,31,973 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,761 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

* అంతకుముందు రోజు 71 మరణాలు నమోదు కాగా.. నిన్న 127 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,16,479కి చేరింది.

* నిన్న 3196 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటి ఆ రేటు 98.74 శాతానికి పెరిగింది.

* రికవరీలు ఎక్కువగా ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 26,240(0.06%) యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి.

* నిన్న 15,34,444 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 181 కోట్లు దాటింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని