India Corona : 1500 దిగువకు కొత్త కేసులు.. 98.75 శాతానికి పెరిగిన రికవరీ రేటు..

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది.  గత కొన్ని రోజులుగా రెండు వేలలోపే నమోదవుతున్న

Updated : 27 Mar 2022 10:10 IST

16 వేలకు క్షీణించిన క్రియాశీల కేసులు..

దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది.  గత కొన్ని రోజులుగా రెండు వేలలోపే నమోదవుతున్న కొత్త కేసులు.. తాజాగా 1500 దిగువకు క్షీణించాయి. మరోవైపు మరణాలు 150కి చేరాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

  1. గడిచిన 24 గంటల్లో 6,20,251 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,421 కేసులు వెలుగులోకి వచ్చాయి.
  2. నిన్న 149 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,21,004కు చేరింది.
  3. నిన్న 1826 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. ఆ రేటు 98.75 శాతానికి పెరిగింది.
  4. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే  ఎక్కువగా ఉంటుండంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 16,187కు తగ్గి.. ఆ రేటు 0.04 శాతానికి క్షీణించింది.
  5. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 29,90,658 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 183 కోట్లు దాటింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని