India Corona : కొత్తగా 3,451 కేసులు.. 40 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో 3 వేలకుపైగానే కేసులు నమోదవుతున్నాయి.

Updated : 08 May 2022 10:18 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో 3 వేలకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇక క్రియాశీల కేసుల సంఖ్య 20 వేలకుపైగానే కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

గడిచిన 24 గంటల్లో 3,60,613 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 3,451 కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 350 కేసులు తగ్గాయి. అయితే.. మొత్తం కేసుల్లో ఒక దిల్లీ నుంచే 1407 కేసులు ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో నిన్న 253 కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఇక నిన్న దేశవ్యాప్తంగా 40 మరణాలు చోటుచేసుకోగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,24,064కు చేరింది.

• నిన్న 3079 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.25 కోట్లు(98.74%) దాటింది.

 కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుండంతో క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు సంఖ్య 20,635(0.05%)గా ఉంది.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 17,39,403 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 190.20 కోట్లు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని