India Corona : 72 వేలు దాటిన క్రియాశీల కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 12వేలకుపైగానే

Updated : 19 Jun 2022 10:36 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 12వేలకుపైగానే నమోదవుతున్నాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ 72 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో 4,46,387 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 12,899 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిలో మహారాష్ట్ర నుంచి 3883 కేసులు.. 2 మరణాలు నమోదయ్యాయి.

* ఇక నిన్న దేశవ్యాప్తంగా 15 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,24,855కు చేరింది.

* శనివారం 8518 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.26 కోట్లు(98.62%) దాటింది.

* రికవరీలు తక్కువగా ఉంటుండటంతో క్రియాశీల కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 72, 474 (0.17%) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 13,24,591 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ 196.14 కోట్ల డోసులు పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని