India Corona : 19 వేల దిగువకు కొత్త కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు 19 వేల దిగువకు చేరాయి.

Published : 07 Aug 2022 09:53 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు 19 వేల దిగువకు చేరాయి. మరోవైపు క్రియాశీల కేసులు 1.3 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

గడిచిన 24 గంటల్లో 3,72,910 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 18,738 కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న 40 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,26,689కు చేరింది. దేశంలో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.34 కోట్లు(98.50%) దాటగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,34,933(0.31%)గా ఉంది. ఇక నిన్న 29,58,617 టీకాలు అందించగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 206.21 కోట్లు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని