India Corona : 16 వేల దిగువకు కొత్త కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు 16 వేల దిగువన నమోదు కాగా..

Updated : 13 Aug 2022 10:13 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు 16 వేల లోపు నమోదు కాగా.. క్రియాశీల కేసులు 1.2 లక్షల దిగువకు చేరాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

గడిచిన 24 గంటల్లో 3,62,802 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 15,815  కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న 68 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,26,996కు చేరింది. ఇక దేశంలో మొత్తం 4.35 కోట్ల(98.54%) మందికి పైగా కరోనా నుంచి కోలుకోగా.. యాక్టివ్‌ కేసులు 1,19,264(0.27%)కు తగ్గాయి.

ఇక దేశవ్యాప్తంగా నిరంతరాయంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌ ద్వారా నిన్న 24,43,064 టీకాలు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకూ అందించిన డోసుల సంఖ్య 207.71 కోట్లు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని