దేశవ్యాప్తంగా 70 లక్షలు దాటిన రికవరీలు

దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 53,370 కొత్త కేసులు వచ్చాయి. 650 మంది వైరస్‌ సోకి మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 8.71 శాతానికి తగ్గింది...........

Published : 24 Oct 2020 10:09 IST

24 గంటల్లో 53,370 కేసులు.. 650 మరణాలు

దిల్లీ: దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 53,370 కొత్త కేసులు వచ్చాయి. 650 మంది వైరస్‌ సోకి మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 8.71 శాతానికి తగ్గాయి. తాజా లెక్కల ప్రకారం రికవరీ రేటు 89.78 శాతంగా ఉంది. మరణాలు రేటు 1.51 శాతానికి చేరింది. మంగళవారం కొత్తగా 12,69,479 నమూనాల్ని పరీక్షించారు.

కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 78,14,682కు చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 6,80,680  మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 70,16,046 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. వరుసగా రెండో రోజు క్రియాశీల కేసుల సంఖ్య 7లక్షల దిగువన నమోదైంది. కరోనాతో ఇప్పటి వరకు 1,17,956 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని