20,923 రికవరీలు.. 18,177 కేసులు

భారత్‌లో కరోనా వృద్ధి రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 9,58,125 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,177 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.........

Published : 03 Jan 2021 10:45 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వృద్ధి రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 9,58,125 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,177 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,23,965కి చేరింది. ఇక కొత్తగా 20,923 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. రికవరీల సంఖ్య 99,27310కు చేరింది. దీంతో రికవరీ రేటు 96.16 శాతానికి చేరింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 217 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,49,435కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,47,220కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.45 శాతంగా కొనసాగుతోంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం.. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. దాదాపు నెల రోజులుగా రోజువారీ రికవరీలు.. కొత్త కేసుల కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక బ్రిటన్‌ రకం కరోనాతో దేశంలో ఇప్పటి వరకు 29 మంది ఆస్పత్రుల్లో చేరారు.

ఇవీ చదవండి..

తొలి దశలో 3 కోట్ల మందికి ఉచిత టీకా

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొత్త రకం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని