15,948 రికవరీలు.. 14,849 కేసులు
భారత్లో గత 24 గంటల్లో 7,81,752 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,849 కేసులు పాజిటివ్గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం వెల్లడించిన వివరాలతో పోలిస్తే.. నేడు రోజువారీ కేసుల.......
దిల్లీ: భారత్లో గత 24 గంటల్లో 7,81,752 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,849 కేసులు పాజిటివ్గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం వెల్లడించిన వివరాలతో పోలిస్తే.. నేడు రోజువారీ కేసుల సంఖ్య నాలుగు శాతం పెరగడం గమనార్హం. ఇక మొత్తం కేసుల సంఖ్య 1,06,54,533కి చేరింది. కొత్తగా 15,948 మంది వైరస్ బారి నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,03,16,786కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.83 శాతానికి పెరిగింది.
ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 155 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,53,339కి చేరింది. ప్రస్తుతం మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,84,408కు తగ్గింది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,91,609 మందికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు టీకా తొలి డోసు అందిన వారి సంఖ్య 15,82,201కు చేరింది. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందుతున్న విషయం తెలిసిందే. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగం కింద ప్రజలకు అందిస్తున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..