100 దిగువకు కొవిడ్ మరణాలు
భారత్లో కొవిడ్ మరణాలు మరోసారి 100 దిగువకు చేరాయి.
20 కోట్ల మార్కును దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
దిల్లీ: భారత్లో కొవిడ్ మరణాలు మరోసారి 100 దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 95 మరణాలు సంభవించాయని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ స్థాయి తగ్గుదల కనిపించడం ఈ నెలలో ఇది రెండోసారి. కాగా, మొత్తం మరణాల సంఖ్య 1,54,918కి చేరింది. మరోవైపు, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు 20 కోట్ల మార్కును దాటాయి. ఫిబ్రవరి 5 నాటికి 20,06,72,589 మంది వైరస్ నమూనాలు స్వీకరించి, పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న 7,40,794 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,713 కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తంగా వైరస్ బారినపడిన వారి సంఖ్య 1.08 కోట్లు దాటింది.
ఇక, క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,48,590కి చేరగా..ఆ రేటు 1.40 శాతానికి తగ్గింది. నిన్న 14,488 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 1,05,10,796(97.16శాతం)గా ఉంది. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 4,57,404 మంది కరోనా టీకా తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 54,16,849 మంది టీకా వేయించుకున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి:
కొవిడ్లో కొత్త రకాలను గంటలోనే పట్టేయవచ్చు
వ్యాక్సిన్ లెక్క ఈమె తేలుస్తుంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్