ఒక్కరోజే 80వేలకు పైగా కరోనా కేసులు
దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. కరోనా రెండో దశ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలకు కారణమవుతోంది.
469 మరణాలు
మహారాష్ట్రలో మహమ్మారి ఉగ్రరూపం
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. కరోనా రెండో దశ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో 11,13,966 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..81,466 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131 చేరింది. గడిచిన 24 గంటల్లో 469 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తంగా 1,63,396 మంది ఈ మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. క్రియాశీల కేసుల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 6,14,696కి చేరింది. క్రియాశీల రేటు 4.78 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో 1.25 శాతానికి తగ్గిన క్రియాశీల రేటులో ఇప్పుడు భారీ పెరుగుదల కనిపిస్తుడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్లిష్ట సమయంలో కొవిడ్ నుంచి కోలుకునే వారి గణాంకాలు కాస్త ఊరటకలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 50,356 మంది వైరస్ను జయించారు. మొత్తం రికవరీలు 1.15 కోట్లు దాటగా.. ఆ రేటు 93.89 శాతానికి తగ్గింది.
మహారాష్ట్రలో ఉగ్రరూపం..
మహరాష్ట్రను కరోనా పట్టి పీడిస్తోంది. దేశవ్యాప్తంగా బయటపడుతోన్న మొత్తం కేసుల్లో సగానికి పైగా ఆ రాష్ట్రంలోనే వెలుగుచూస్తున్నాయి. నిన్న 43,183 మందికి పాజిటివ్గా తేలగా..249 మంది మరణించారు. మొత్తంగా 28లక్షల మందికి పైగా కరోనా సోకగా..24 లక్షల మందికి పైగా కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 3,67,897 క్రియాశీల కేసులున్నాయి.
నిన్న 36.7లక్షల మందికి టీకా..
దేశవ్యాప్తంగా నడుస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద నిన్నటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు అందిస్తున్నారు. ఏప్రిల్ ఒకటిన కేంద్రం 36,71,242 మందికి టీకా డోసులను పంపిణీ చేసింది. మొత్తంగా 6.87 కోట్ల మందికి టీకాలు అందాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్