Corona: 96 శాతానికి చేరువైన రికవరీ రేటు

దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులోకి వస్తోంది. నెలరోజులకు పైగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. క్రియాశీల కేసుల కొండ తరిగిపోతోంది. మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 67వేల మందికి కరోనా సోకినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. 

Updated : 17 Jun 2021 10:05 IST

67 వేల కేసులు..8 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు 

దిల్లీ: దేశంలో కరోనా తీవ్రత అదుపులోకి వస్తోంది. నెలరోజులకు పైగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. క్రియాశీల కేసుల కొండ కరిగిపోతోంది. మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 67వేల మందికి కరోనా సోకినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. 

బుధవారం 19,31,249 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..67,208మందికి పాజిటీవ్‌ వచ్చింది. అయితే, వరుసగా రెండోరోజు కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 2.97కోట్లకు చేరింది. 24 గంటల వ్యవధిలో 2,330మంది మృత్యుఒడికి చేరుకొన్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 3,81,903మంది మహమ్మారికి  బలయ్యారు. 

ఇక క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 8,26,740మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 2.78శాతానికి తగ్గింది. రికవరీ రేటు 95.93 శాతానికి పెరిగింది. నిన్న 1,03,570 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.85కోట్లు చేరాయి. మరోపక్క నిన్న 34,63,961 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 26,55,19,251కి చేరింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు